News April 24, 2024

టీడీపీలో చేరిన రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ చిరంజీవి రెడ్డి

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి విధివిధానాలు నచ్చక వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరానని మెట్టుకూరు చిరంజీవి రెడ్డి అన్నారు.

Similar News

News October 26, 2025

తుపాన్ హెచ్చరికలు.. PGRS రద్దు: కలెక్టర్

image

మెంథా తుపాన్ దృష్ట్యా సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇళ్ల వద్దనే ఉండాలన్నారు. ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.

News October 26, 2025

గుంటూరులో ప్రమాదం.. తెగిపడిన కాలు..!

image

పట్టాభిపురం పీఎస్ పరిధిలోని కృష్ణనగర్ కుందుల రోడ్డులో ప్రమాదం జరిగింది. కొరిటెపాడు ప్రాంతానికి చెందిన సురేష్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సురేష్‌కి తీవ్రగాయాలయ్యాయి. ఓ కాలు పూర్తిగా తెగిపోయింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారని స్థానికులు చెప్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News October 26, 2025

GNT: గుమ్మడి సాగుతో అధిక దిగుబడి

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంతర పంటల సాగుతో రైతులు అధిక లాభాలు అర్జిస్తున్నారు. ప్రధాన పంటలో గుమ్మడి కాయ ఒకటి. ఎకరాకు రూ.11 వేల వరకు పెట్టుబడితో 90 నుంచి 120 రోజుల్లో.. ఎకరాకు 4 నుంచి 6 టన్నుల వరకు దిగుబడి వస్తుందని, రూ. 50 నుంచి 80వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. జూన్-జులై, డిసెంబర్-జనవరి నెలలు సాగుకు అనువైన సమయం.
#నేడు జాతీయ గుమ్మడి కాయ దినోత్సవం