News January 31, 2025

టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి: లోకేశ్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ సంబంధిత జిల్లాల ఇంఛార్జ్ మంత్రులతో గురువారం సమావేశం అయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థుల విజయానికి ఇంఛార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని నారా లోకేశ్ అన్నారు. ప్రతి ఓటరును పార్టీ శ్రేణులు నేరుగా కలవాలని, సోషల్ మీడియా పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News October 23, 2025

గుంటూరులో ట్రాఫిక్ నిర్వహణపై ఎస్పీ ఆకస్మిక పర్యటన

image

గుంటూరు నగరంలో ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ పనితీరును ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. పట్టాభిపురం, బ్రాడీపేట, కొత్తపేట, బస్టాండ్ సెంటర్, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News October 23, 2025

GNT: స్కూల్స్‌కు సెలవుపై పేరెంట్స్ విమర్శలు

image

భారీ వర్షాల కారణంగా గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంపై తల్లిదండ్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉదయం 9 గంటల తర్వాత సెలవు ప్రకటించడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అప్పటికే పిల్లలు వర్షంలో తడుస్తూ పాఠశాలలకు వెళ్లిపోయారని, ఉదయం నుంచే వర్షం పడుతున్నందున ముందుగానే స్పందించి ఉండాల్సిందన్నారు. రేపటి సెలవు సమాచారమైనా ముందుగానే స్పష్టంగా ఇవ్వాలన్నారు.

News October 23, 2025

GNT: భారీ వర్షాలకు అప్రమత్తమైన అధికార యంత్రాంగం

image

తీవ్ర అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గుంటూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం ఉదయం నుంచి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల ప్రజలను అప్రమత్తంగా చేయాలని, చెట్లు, భారీ హోర్డింగ్లు, శిథిల భవనాల వద్ద ఉంచవద్దని సూచించారు. అత్యవసరమైతే గుంటూరు కలెక్టరేట్ నెంబర్ 08632234990కు సమాచారం ఇవ్వాలని సూచించారు.