News April 4, 2024

టీడీపీ కుటిల రాజకీయం చేస్తోంది: బొత్స

image

గరివిడి మండలం నీలాద్రిపురం, రేగటి గ్రామాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. అనంతరం జరిగిన ప్రచార సభల్లో ఆయన మాట్లాడుతూ.. పేదలకు అందే లబ్ధితోనూ టీడీపీ కుటిల రాజకీయం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి రహితంగా, దళారులు లేకుండా సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తున్నామ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మరలా వైసీపీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఎంపి బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Similar News

News September 30, 2024

VZM: యువతకు ఎస్పీ కీలక సూచనలు

image

ప్రస్తుతం గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతూ, చట్టాలను కూడా కఠినతరం చేశామన్న విషయాన్ని యువత గమనించాలని విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గంజాయి అక్రమ రవాణా కేసులో పట్టుబడితే 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడుతుందన్నారు. గంజాయి కేసుల్లో ఎక్కువగా యువత పట్టుబడుతూ.. జైల్లో మగ్గుతున్నారని ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు.

News September 30, 2024

విజయనగరం: TODAY TOP NEWS

image

⁍VZM: దసరా సెలవులు ఆరు రోజులే
⁍పార్వతీపురం దిశ సెల్ ఎస్ఐలు వీరే
⁍బొబ్బిలిలో కొండచిలువ హతం
⁍విజయనగరం జిల్లాలో ఎక్సైజ్ సీఐలకు బదిలీలు
⁍విజయనగరం జిల్లాలో టెట్ పరీక్షా కేంద్రాలివే
⁍పైడితల్లమ్మ సిరిమాను చెట్టుకు పూజలు
⁍రేపు బొబ్బిలి రానున్న సినీ నటుడు సాయికుమార్
⁍కురుపాంలో యాక్సిడెంట్.. ఇద్దరు స్పాట్‌డెడ్
⁍నిండుకుండలా తాటిపూడి జలాశయం
⁍రామతీర్థంలో రామచంద్ర ప్రభువుకు పట్టు పవిత్రాల సమర్పణ

News September 29, 2024

కురుపాంలో యాక్సిడెంట్.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

కురుపాం మండలం వలసబల్లేరు సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని నీలకంఠపురం SI తెలిపారు. ఘటనలో బిడ్డిక జూజారు, బిడ్డిక శ్రీను మృతిచెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.