News March 20, 2024
టీడీపీ జెండాలతోనే బోడె ప్రసాద్ ప్రచారం

పెనమలూరు టికెట్ విషయంలో టీడీపీ అధిష్ఠానం లెక్కలు వేసుకునే పనిలో ఉంటే, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బుధవారం సాయంత్రం పెనమలూరులో బోడె ప్రసాద్, ఆయన సతీమణి, కుటుంబ సభ్యులంతా టీడీపీ జెండాలతోనే ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఇక చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందోనని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు.
Similar News
News February 16, 2025
MLC ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్రే కీలకం : DRO

పట్టభద్రుల MLC ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్రే కీలకం అని కృష్ణాజిల్లా సహాయ ఎన్నికల అధికారి, DRO కె చంద్రశేఖరరావు అన్నారు. సూక్ష్మ పరిశీలకులుగా నియమితులైన వారికి శనివారం కలెక్టరేట్లో వారి విధులపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా DRO మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను, నిబంధనలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలన్నారు.
News February 15, 2025
పెనమలూరు: ఆన్లైన్లో రూ.1.55 లక్షల స్వాహా

సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఉపాధ్యాయుడు మోసపోయిన ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న కానూరుకి చెందిన రమణమూర్తి అతని ఫోన్లో ఉన్న టెలిగ్రామ్ యాప్కు`Global India Private Limited’ పేరుతో అధిక లాభాలు వస్తాయని మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన రూ.1.55 లక్షలు జమ చేశారు. తర్వాత వారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 15, 2025
గన్నవరం: కిడ్నాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ను అపహరించిన కేసులో శుక్రవారం పటమట పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ రోజు వంశీబాబు, గంటా వీర్రాజును అరెస్ట్ చేశారు. వంశీబాబు కారును పోలీసులు సీజ్ చేశారు. ఈ అరెస్టుతో సత్యవర్ధన్ను అపహరించిన కేసులో మొత్తంగా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, రామకృష్ణ జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.