News December 24, 2024
టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి.. 33 మందిపై కేసులు

కొమరోలు మండలంలోని ముత్తరాసు పల్లె గ్రామంలో ఇరువర్గాల పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్న సంఘటనపై కేసులు నమోదు చేసినట్లుగా కొమరోలు ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం రాజకీయ కక్ష్యల నేపథ్యంలో ఇరువర్గాలు రాళ్లతో దాడులు చేసుకోగా ఇరువర్గాల ఫిర్యాదు మేరకు టీడీపీకి చెందిన 14 మందిపై, వైసీపీకి చెందిన 19 మందిపై కేసులు నమోదు చేసినట్లుగా వెల్లడించారు.
Similar News
News November 28, 2025
ప్రకాశం: పొగ మంచు కురుస్తోంది.. జాగ్రత్త.!

ప్రస్తుతం జాతీయ రహదారుల్లో అధికంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని, వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వాహనదారులు, డ్రైవర్లకు శుక్రవారం పలు సూచనలు జారీ చేసింది. హైవేల్లో రాకపోకలు సాగించే వాహనాలకు కాస్త గ్యాప్తో ప్రయాణించాలన్నారు. అలాగే ట్రాఫిక్ జామ్ సమయాలలో కూడా వాహనాల రద్దీ నేపథ్యంలో జాగ్రత్త వహించాలన్నారు.
News November 28, 2025
ప్రకాశం జిల్లాలో విద్యా సంస్థలు బంద్..?

మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 4న జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు విద్యార్థి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం వారు ఒంగోలులో మాట్లాడారు. విద్యార్థి JAC రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ.. విద్యాసంస్థల బందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. జిల్లా యూనివర్సిటీ త్రిబుల్ ఐటీకి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
News November 28, 2025
ప్రకాశం జిల్లా వాసులకు గుడ్ న్యూస్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా శుక్రవారం పామూరు ఈటీఎన్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారావు తెలిపారు. 10, ఇంటర్, డిగ్రీ, ఆపై చదివిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. నెలకి రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం వస్తుందన్నారు. పూర్తి వివరాలకు. 99888 53335 నంబరును సంప్రదించాలన్నారు.


