News December 23, 2024

టీమిండియా ఆశా కిరణం భద్రాచలం అమ్మాయి

image

U-19 ఆసియా కప్ భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ గెలుపులో భద్రాచలం అమ్మాయి గొంగిడి త్రిష కీలక పాత్ర పోషించింది. 47 బంతుల్లో 52 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ మాత్రమే కాదు టోర్నీ అంతా నిలకడగా ఆడి 159 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గాను ఎంపికైంది. త్రిష ఇలానే ఆడితే మున్ముందు సీనియర్ టీంకు ఎంపికవుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News January 14, 2025

ఖమ్మం శివారులో మహిళ సూసైడ్ 

image

చెట్టుకు ఉరి వేసుకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో ఈ ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి క్రాస్ రోడ్ సమీపంలో గుర్తుతెలియని మహిళ చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

News January 14, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

News January 14, 2025

ఖమ్మం: మంత్రి తుమ్మల పట్టుబట్టి మరి సాధించారు: ఉత్తమ్

image

మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను మంత్రి తుమ్మల పట్టు బట్టి మరి సాధించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సంక్రాంతి కానుకగా రఘునాథపాలెం ప్రజలకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఇవ్వాలని తుమ్మల పట్టుబట్టారన్నారు. రూ.1.8 లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రంగా ఆయకట్టు నిర్మించినా సాగులోకి మాత్రం తీసుకు రాలేదన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మించి ఒక్క ఎకరాకు సైతం సాగు నీరు అందించలేదన్నారు.