News January 30, 2025
టీయూ విద్యార్థులకు ALERT

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బీఎడ్ సెంకడీయర్ మూడో సెమిస్టర్ (రెగ్యులర్) పరీక్ష ఫీజ్ తేదీలను యూనివర్సిటీ వెల్లడించింది. ఫిబ్రవరి 8 వరకు చెల్లించవచ్చని పేర్కొంది. రూ.100 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 10 వరకు చెల్లించే అవకాశం ఉందని పరీక్షల నియంత్రణ అధికారిణి ఆచార్య ఎం.అరుణ ఒక ప్రకటనలు తెలిపారు. పూర్తి వివరాలను తెలంగాణ వర్సిటీ వెబ్సైట్ లో పొందుపరిచినట్లు వెల్లడించారు.
Similar News
News October 14, 2025
SRSP అప్డేట్.. 4గేట్ల ద్వారా నీటి విడుదల

SRSP ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 22,290 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా 4 గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాకతీయకు 5000, ఎస్కేప్ గేట్లు (రివర్) 3000, సరస్వతి కాలువ 650, లక్ష్మి 200, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు తగ్గుతోంది. నీటిమట్టం 1091 అడుగులు కాగా 80.501TMC నీరు ఉంది.
News October 14, 2025
NZB: ఈనెల 21 నుంచి పోలీస్ అమరుల సంస్మరణ వారోత్సవాలు

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఈ నెల 21 నుంచి 31 వరకు సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని స్మరించుకున్నారు. వారోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
News October 14, 2025
నిజామాబాద్: సవాలుగా మారిన బంగారం చోరీ కేసు

ఇందల్వాయి మండలం లింగాపూర్లో దుర్గాదేవి నవరాత్రుల సమయంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన అపర్ణ పూజా కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చొరబడి 8 తులాల బంగారం, 25 తులాల వెండిని దొంగలు అపహరించారు. సోమవారం బాధితురాలు సీపీ సాయి చైతన్యకు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు.