News April 4, 2025

టీ.నర్సాపురం: ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

image

టీ.నర్సాపురం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన కొక్కుల సోమేశ్వరరావు(60) గుండెపోటుతో బస్సులో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ భార్యను వెంటబెట్టుకొని జగ్గవరం నుంచి బస్సులో హాస్పటల్‌కి బయలుదేరారు. మార్గమధ్యలో రాజు పోతేపల్లి సెంటర్ వద్దకు వచ్చేసరికి ఆయనకు గుండెపోటుతో రావడంతో మృతి చెందారు. తన భుజంపై ప్రాణాలు విడిచిన భర్తను చూసి భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు. 

Similar News

News December 31, 2025

VZM: ముమ్మరంగా వాహన తనిఖీలు

image

ఇవాళ రాత్రి 7 గంటల నుంచి విజయనగరంలోని 150 ప్రాంతాల్లో సుమారు 1,000 మంది పోలీసు సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రజల భద్రత, రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు ఈ తనిఖీలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

News December 31, 2025

కడప: ‘ధాన్యం అమ్మిన మూడు రోజుల్లో డబ్బులు జమ’

image

కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు 3 రోజుల్లో డబ్బులు జమ అవుతాయని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ నాగసుధ పేర్కొన్నారు. దువ్వూరులోని కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సివిల్ సప్లై జిల్లా మేనేజర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. ధాన్యం విక్రయించే రైతులకు గోనె సంచులు, హమాలీ ఖర్చులను ప్రభుత్వమే భరాయిస్తుందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.

News December 31, 2025

శివలింగం ధ్వంసం చేసింది హిందువే: SP

image

AP: ద్రాక్షారామం పుణ్యక్షేత్రంలో <<18714825>>శివలింగం<<>> ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ‘ఈ పని చేసింది తోటపేటకు చెందిన శీలం శ్రీనివాసరావు అనే వ్యక్తి. ఆలయ సిబ్బందితో అతనికి డ్రైనేజీ విషయంలో గొడవలయ్యాయి. వారిని ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశాడు. నిందితుడు క్రిస్టియన్ కాదు హిందువే. అతని ఒంటిపై టాటూలు కూడా ఉన్నాయి. అతను వాడిన వస్తువులు, స్కూటీ, దుస్తులు సీజ్ చేశాం’ అని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు.