News April 4, 2025

టీ.నర్సాపురం: ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

image

టీ.నర్సాపురం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన కొక్కుల సోమేశ్వరరావు(60) గుండెపోటుతో బస్సులో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ భార్యను వెంటబెట్టుకొని జగ్గవరం నుంచి బస్సులో హాస్పటల్‌కి బయలుదేరారు. మార్గమధ్యలో రాజు పోతేపల్లి సెంటర్ వద్దకు వచ్చేసరికి ఆయనకు గుండెపోటుతో రావడంతో మృతి చెందారు. తన భుజంపై ప్రాణాలు విడిచిన భర్తను చూసి భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు. 

Similar News

News November 24, 2025

డిటెన్షన్ సెంటర్లకు అక్రమ వలసదారులు: యూపీ సీఎం

image

అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను యూపీ CM యోగి ఆదేశించారు. ప్రతి జిల్లాలో తాత్కాలిక డిటెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. విదేశీ పౌరసత్వం ఉన్న వలసదారుల వెరిఫికేషన్ పూర్తయ్యేవరకు డిటెన్షన్ సెంటర్లలో ఉంచాలని సూచించారు. వారు స్థిరపడిన విధానాన్ని బట్టి స్వదేశాలకు పంపించాలన్నారు. మరోవైపు 8ఏళ్లుగా అధికారంలో ఉండి ఇప్పుడు కావాలనే హడావిడి చేస్తున్నారని కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ ఆరోపించారు.

News November 23, 2025

ఇలా పడుకుంటే ప్రశాంతమైన నిద్ర

image

రాత్రిళ్లు ప్రశాంతమైన నిద్ర కోసం ఎడమ వైపు పడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ‘బోర్లా, వెల్లకిలా కంటే ఈ పొజిషన్‌లో మంచి నిద్ర వస్తుంది. గుండెకు రక్తసరఫరా, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శ్వాసలో ఇబ్బందులు, గురక సమస్య తగ్గుతుంది. ఎక్కువసేపు బోర్లా పడుకుంటే నడుము, మెడ నొప్పి, శ్వాస సమస్యలు పెరుగుతాయి. తల కింద దిండు అలవాటు ఉన్నవాళ్లు సాఫ్ట్ పిల్లోలను ఎంచుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News November 23, 2025

WNP: శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్పీ నాయకత్వం కీలకం: కలెక్టర్

image

వనపర్తి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణలో ఎస్పీ రావుల గిరిధర్ నాయకత్వం విశేషమైనదని కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. ప్రజలకు దగ్గరగా ఉండే పోలీసింగ్ పద్ధతిని అమలులోకి తీసుకువచ్చి, సేవలో సమగ్రతకు కొత్త ప్రమాణాలు నెలకొల్పారని అన్నారు. జిల్లాకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ పేర్కొన్నారు.