News April 4, 2025
టీ.నర్సాపురం: ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

టీ.నర్సాపురం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన కొక్కుల సోమేశ్వరరావు(60) గుండెపోటుతో బస్సులో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ భార్యను వెంటబెట్టుకొని జగ్గవరం నుంచి బస్సులో హాస్పటల్కి బయలుదేరారు. మార్గమధ్యలో రాజు పోతేపల్లి సెంటర్ వద్దకు వచ్చేసరికి ఆయనకు గుండెపోటుతో రావడంతో మృతి చెందారు. తన భుజంపై ప్రాణాలు విడిచిన భర్తను చూసి భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు.
Similar News
News November 21, 2025
NRPT: స్థానిక ఎన్నికలపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News November 21, 2025
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2,803 మందికి లబ్ధి

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల రూ.లక్ష లోపు రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2,803 మంది చేనేత కార్మికులకు రూ.23.25 కోట్ల రుణమాఫీ కానుంది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల పరిధిలో ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2024 మధ్య తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
News November 21, 2025
కొత్త టీచర్లకు సెలవులు ఇలా..

AP: మెగా డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన కొత్త టీచర్లకు సెలవులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 3న వీరు విధుల్లో చేరగా డిసెంబర్ వరకు వర్తించే ప్రపోర్షనేట్ సెలవులను వెల్లడించింది. 4 CL(క్యాజువల్ లీవ్), 1 OH(ఆప్షనల్ హాలిడే), 2 SPL CL(స్పెషల్ క్యాజువల్ లీవ్), మహిళలు అదనంగా ఒక స్పెషల్ CL వినియోగించుకోవచ్చని తెలిపింది. మెగా డీఎస్సీ ద్వారా 15,941 మంది ఎంపికైన విషయం తెలిసిందే.


