News March 17, 2025
టూరిజం స్పాట్గా పల్నాడు జిల్లా

జిల్లాల పునర్విభజనలో పలు కీలక ప్రాంతాలు పల్నాడు జిల్లా పరిధి లోనికి రావటంతో పల్నాడు టూరిజం హబ్గా అభివృద్ధి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. నాగార్జునసాగర్, ఎత్తిపోతల, పులిచింతల, అమరావతి, కొండవీడు, కోటప్పకొండ, గుత్తికొండ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తాయి. పల్నాడు కృష్ణానది పరివాహక ప్రాంతం కావడంతో టూరిజం స్పాట్ గా అభివృద్ధి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
Similar News
News November 2, 2025
భద్రాద్రి: మా రహదారి కష్టాలు తీర్చే నాధుడే లేరా?

చర్ల మండలం తిప్పాపురం నుంచి బత్తిన పెళ్లికి సరైన రోడ్డు మార్గం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రికి తరలించాలంటే డోలీ మోతలే దిక్కని వాపోతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాయకులు కూడా గ్రామానికి రావడం మానేశారని, ఇప్పటికైనా అధికారులు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.
News November 2, 2025
వరల్డ్ కప్.. వికెట్ పడగొట్టిన శ్రీచరణి

మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇందులో భాగంగా కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన టీం ఇండియా బౌలర్ శ్రీచరణి వికెట్ పడగొట్టింది. సౌతాఫ్రికా 62 పరుగుల వద్ద ఉండగా ఆమె బ్యాటర్ బాష్(Bosch)ను రెండో వికెట్గా పెవిలియన్కు పంపింది.
News November 2, 2025
VJA: జోగి రమేశ్ విచారణ పూర్తి.. కుమారుడికి నోటీసులు జారీ

నకిలీ మద్యం కేసులో మాజీమంత్రి జోగి రమేశ్ సిట్ విచారణ పూర్తి అయ్యింది. 11 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. జనార్దనరావుతో సంబంధాలపై సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. కాసేపట్లో ప్రభుత్వాస్పత్రికి జోగి రమేశ్ తరలించారు. జోగి రమేశ్ చిన్న కుమారుడు జోగి రోహిత్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని రోహిత్కు సిట్ నోటీసులు జారీ చేశారు.


