News April 29, 2024
టెక్కలి: విద్యుత్ షాక్కు గురై వ్యక్తికి గాయాలు

టెక్కలి-మెళియాపుట్టి రోడ్డులో సోమవారం విద్యుత్ షాక్కు గురై ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఫైబర్ నెట్ పనుల నిమిత్తం విద్యుత్ స్తంభం భం ఎక్కిన సమయంలో ప్రమాదవశాత్తూ.. విద్యుత్ తీగలు తగలడంతో షాక్కు గురై కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు టెక్కలి పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News December 6, 2025
సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు ఇవ్వండి: మంత్రి అచ్చెన్నాయుడు

దేశ రక్షణలో అమరులైన, విధీ నిర్వహణలో గాయపడిన మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ప్రతి ఒక్కరు ఉదారంగా విరాళాలు అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో ఆయన ముందుగా విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంకర్, రవికుమార్, కలెక్టర్ పాల్గొన్నారు.
News December 6, 2025
సారవకోట: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సారవకోట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. అలుదు గ్రామానికి చెందిన శంకర్రావు కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని భార్యను నిత్యం వేధించేవాడు. శుక్రవారం రాత్రి కూడా డబ్బులు అడగగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై అనిల్ కుమార్ శనివారం కేసు నమోదు చేశారు.
News December 6, 2025
సారవకోట: మద్యం డబ్బుల కోసం గొడవ.. వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సారవకోట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. అలుదు గ్రామానికి చెందిన శంకర్రావు కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని భార్యను నిత్యం వేధించేవాడు. శుక్రవారం రాత్రి కూడా డబ్బులు అడగగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై అనిల్ కుమార్ శనివారం కేసు నమోదు చేశారు.


