News February 26, 2026

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్

image

పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన.. పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేసి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నజీరుద్దీన్ పాల్గొన్నారు.

Similar News

News April 16, 2026

కొల్చారం: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం: కలెక్టర్

image

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొల్చారంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరవేయడమే లక్ష్యమని ఆమె తెలిపారు. గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సత్వర న్యాయం చేయాలని సూచించారు.

News April 16, 2026

కొల్చారం: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం: కలెక్టర్

image

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొల్చారంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరవేయడమే లక్ష్యమని ఆమె తెలిపారు. గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సత్వర న్యాయం చేయాలని సూచించారు.

News April 16, 2026

మెదక్: రైతు బంధు నిలిపివేయడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

image

రైతులకు రావాల్సిన రైతు బంధు నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపురం గ్రామానికి చెందిన పిటిషనర్ల భూములకు సంబంధించి రైతు బంధు మొత్తాలు నిలిపివేయడం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం చట్టవిరుద్ధమని ప్రాథమికంగా గుర్తించిన న్యాయస్థానం, కలెక్టర్ సహా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.