News February 26, 2026

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్

image

పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన.. పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేసి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నజీరుద్దీన్ పాల్గొన్నారు.

Similar News

News April 18, 2026

ద్విచక్ర వాహనాలు ఢీ.. పదో తరగతి విద్యార్థి మృతి

image

టేక్మాల్ (M) ఎల్లంపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సండ్రు సదానందం (16) మృతి చెందగా, శెట్టి గోపాల్ (28) తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరూ వేర్వేరు బైక్‌లపై వెళ్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నారు. ఆస్పత్రికి తరలించేలోపే సదానందం ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడు ఇటీవలనే SSC పరీక్షలు రాశాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 18, 2026

మెదక్ జిల్లాలో కాకతీయ శిల్పం గుర్తింపు

image

చిన్నశంకరంపేట మండలం మండలంలోని గవ్వలపల్లి శివాలయం వద్ద కాకతీయ శైలికి చెందిన తాంత్రిక భైరవ శిల్పాన్ని చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. చతుర్భుజాలతో, మెడలో సర్పహారం, డమరుకం ధరించి త్రిభంగిమలో ఉన్న ఈ శిల్పం అరుదైనదని ఆయన తెలిపారు. మన పూర్వీకులు అందించిన ఇలాంటి పురాతన విగ్రహాలను, చారిత్రక సంపదను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.

News April 18, 2026

మెదక్ జిల్లాలో కాకతీయ శిల్పం గుర్తింపు

image

చిన్నశంకరంపేట మండలం మండలంలోని గవ్వలపల్లి శివాలయం వద్ద కాకతీయ శైలికి చెందిన తాంత్రిక భైరవ శిల్పాన్ని చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. చతుర్భుజాలతో, మెడలో సర్పహారం, డమరుకం ధరించి త్రిభంగిమలో ఉన్న ఈ శిల్పం అరుదైనదని ఆయన తెలిపారు. మన పూర్వీకులు అందించిన ఇలాంటి పురాతన విగ్రహాలను, చారిత్రక సంపదను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.