News March 14, 2025
టెన్త్ ఎగ్జామ్స్..ఎలా చదువుతున్నారు: కలెక్టర్

పదవ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయని, కష్టపడి చదువుకుంటే మంచి మార్కులు వస్తాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కొండాపూర్ కస్తూర్బా పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదివించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండల విద్యాధికారి దశరథ్ పాల్గొన్నారు.
Similar News
News October 22, 2025
సంగారెడ్డి: పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి: కలెక్టర్

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ.24 లక్షల సబ్సిడీ ఆమోదం లభించినట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 22, 2025
ప.గో: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

ఎన్టీఆర్(D) మైలవరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి గొర్రె అరవింద్(22) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప.గో జిల్లా జంగారెడ్డిగూడెం(M) దేవరపల్లికి చెందిన అరవింద్ మైలవరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు. బెట్టింగ్లో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 22, 2025
ఖమ్మం: EVERY CHILD READS ప్రారంభం

ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో EVERY CHILD READS కార్యక్రమాన్ని నెల రోజుల పాటు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 1–5 తరగతి విద్యార్థుల రీడింగ్ స్కిల్స్ పెంపుపై ప్రతిరోజు గంటసేపు కేటాయించాలని సూచించారు. ప్రతి విద్యార్థి అక్షరాలు, పదాలు, పేరాలు అర్థం చేసుకునే స్థాయికి చేరేలా చేయాలన్నారు.