News March 14, 2025
టెన్త్ ఎగ్జామ్స్..ఎలా చదువుతున్నారు: కలెక్టర్

పదవ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయని, కష్టపడి చదువుకుంటే మంచి మార్కులు వస్తాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కొండాపూర్ కస్తూర్బా పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదివించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండల విద్యాధికారి దశరథ్ పాల్గొన్నారు.
Similar News
News February 12, 2026
ADB: ఓటర్ల చెంతకు వాహనం.. కలెక్టర్ రాజర్షి షా చొరవ

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఓటరు తన ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు పోలింగ్ కేంద్రాలకు సులభంగా చేరుకునేలా ఉచిత వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్లను ఇంటి వద్ద నుంచే పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా ఇంటికి చేర్చారు.
News February 12, 2026
వరంగల్: అప్పుడు 76.26%, ఇప్పుడు 78.25%

మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్లో గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 12 మున్సిపాలిటీల్లో కలిపి 78.25శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 3,35,244 మంది ఓటర్లకు 2,58,930 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2020 ఎన్నికల్లో 9 మున్సిపాలిటీల్లో 200 వార్డులకు, 18 ఏకగ్రీవం కాగా, 182 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు 2,32,763 ఓటర్లకు 1,77,508 మంది ఓటేశారు. 2020లో 76.26% పోలింగ్ నమోదైంది.
News February 12, 2026
కిసాన్ రైల్ ద్వారా 34 వేల టన్నుల పంట ఉత్పత్తుల రవాణా

ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కిసాన్ రైల్ ద్వారా 116 సర్వీసులతో 34వేల టన్నుల పంట ఉత్పత్తులను వివిధ రాష్ట్రాలకు రవాణా చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2020 AUG 7న కిసాన్ రైళ్లను కేంద్రం ప్రారంభించింది. AP నుంచి మామిడి, అరటి, ఉల్లి ఇతర ఉద్యాన ఉత్పత్తులను బిహార్, అస్సాం, ప.బెంగాల్, ఢిల్లీ, త్రిపురలకు రవాణా చేశామని.. లోక్సభలో TDP MP ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


