News March 14, 2025

టెన్త్ పరీక్షలపై జేసీ సమీక్ష..అధికారులకు పలు సూచనలు 

image

జిల్లా వ్యాప్తంగా ఈనెల 17 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకుంటూ సజావుగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి అధికారులను ఆదేశించారు. గురువారం 10వ తరగతి పరీక్షల నిర్వహణ సన్నద్ధతపై అధికారులతో జేసీ సమీక్షించారు. 19,217 మంది విద్యార్థులకు 110 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు.

Similar News

News November 23, 2025

ఏలూరు కలెక్టరేట్‌లో సత్యసాయి జయంతి ఉత్సవాలు

image

ఏలూరులోని గౌతమీ సమావేశ మందిరంలో ఆదివారం శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, డీఆర్‌ఓ వి.విశ్వేశ్వరరావు హాజరై.. బాబా చిత్రపటానికి పూలమాలలు వేశారు. మనుషుల్లో ప్రేమ ఉన్నంతకాలం సత్యసాయి బాబా మన మధ్యే ఉంటారని, ఆయన చూపిన సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

News November 23, 2025

రేపటి నుంచి అంతర్ జిల్లాల ఫెన్సింగ్ పోటీలు ప్రారంభం

image

AP పాఠశాల విద్యాశాఖ నిర్వహించనున్న 69వ అంతర్ జిల్లాల SGF-17 బాల బాలికల ఫెన్సింగ్ టోర్నమెంట్ సోమవారం నుంచి ఈనెల 26 వరకు సఖినేటిపల్లి మండలం మోరిలోని జాన సుబ్బమ్మ మెమోరియల్ హైస్కూల్ వద్ద నిర్వహించనున్నారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారులు కిషోర్ కుమార్, యం.వేంకటేశ్వరరావు ఆదివారం వివరాలు వెల్లడించారు. 3 రోజులు ఈ ఈవెంట్‌కు ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు హైస్కూల్ GHM శ్రీధర్ కృష్ణ తెలిపారు.

News November 23, 2025

తంబళ్లపల్లె టీడీపీలో కలవరం?

image

తంబళ్లపల్లె టీడీపీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు నాయకులు, కార్యకర్తలను కలవరపెడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో TDP అభ్యర్థి జయచంద్రా రెడ్డి ఓటమి చెందగా.. ములకలచెరువు కల్తీ మద్యం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ 2 నెలల క్రితం సస్పెండ్ అయ్యారు. ఇక బుధవారం అంగళ్లులో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సమక్షంలోనే తెలుగు తమ్ముళ్ల వర్గపోరు బాహాటమైంది.