News March 14, 2025
టెన్త్ పరీక్షలపై జేసీ సమీక్ష..అధికారులకు పలు సూచనలు

జిల్లా వ్యాప్తంగా ఈనెల 17 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకుంటూ సజావుగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి అధికారులను ఆదేశించారు. గురువారం 10వ తరగతి పరీక్షల నిర్వహణ సన్నద్ధతపై అధికారులతో జేసీ సమీక్షించారు. 19,217 మంది విద్యార్థులకు 110 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు.
Similar News
News November 28, 2025
నల్గొండ జిల్లాలో ఇవాళ్టి టాప్ న్యూస్

✓మర్రిగూడ: నగదు ఎలా స్వీకరిస్తున్నారు.. ఇలా త్రిపాఠి వాకబు
✓చెర్వుగట్టు హుండీ ఆదాయం లెక్కింపు
✓చండూరు: కుల ధృవీకరణ కోసం పడిగాపులు
✓మిర్యాలగూడ: భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
✓నల్గొండ: కుక్కల స్వైర విహారం.. 22 గొర్రెల మృతి
✓కట్టంగూరు: కాంగ్రెస్లో బయటపడ్డ వర్గ విభేదాలు
✓చిట్యాల: అప్పుడు వార్డు మెంబర్.. ఇప్పడు మండలి ఛైర్మన్
News November 28, 2025
వనపర్తి: బకాయి చెల్లిస్తేనే కొత్త ధాన్యం: అదనపు కలెక్టర్

వనపర్తి జిల్లాలో డిఫాల్టర్ల జాబితాలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి బకాయి ఉన్న సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) తో పాటు, పెనాల్టీ కూడా చెల్లిస్తేనే కొత్తగా ధాన్యం పొందవచ్చని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యా నాయక్ సూచించారు. రైస్ మిల్లర్లతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నూరు శాతం సీఎంఆర్తో పాటు, 12% లేదా 25% పెనాల్టీ చెల్లిస్తేనే కొత్త ధాన్యం పొందడానికి అర్హత సాధిస్తారని స్పష్టం చేశారు.
News November 28, 2025
మంచిర్యాల జిల్లాలో సర్పంచి స్థానాలకు 99 నామినేషన్లు

మంచిర్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ పర్వం కొనసాగుతోంది. శుక్రవారం 90 సర్పంచ్ స్థానాలకు 99 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 816 వార్డులకు 222 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3న ఉపసంహరణ, 11న పోలింగ్ జరగనుంది.


