News March 14, 2025

టెన్త్ పరీక్షలపై జేసీ సమీక్ష..అధికారులకు పలు సూచనలు 

image

జిల్లా వ్యాప్తంగా ఈనెల 17 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకుంటూ సజావుగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి అధికారులను ఆదేశించారు. గురువారం 10వ తరగతి పరీక్షల నిర్వహణ సన్నద్ధతపై అధికారులతో జేసీ సమీక్షించారు. 19,217 మంది విద్యార్థులకు 110 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు.

Similar News

News March 21, 2025

ఎంఎస్ ధోనీ అన్ని సీజన్ల స్కోర్లు ఇవే

image

భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ IPL తొలి సీజన్ నుంచి ఆడుతున్నారు. ఇప్పటికీ తన ఆటతీరుతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 43 ఏళ్ల వయసులో IPL 2025లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ధోనీ అన్ని సీజన్ల స్కోర్లు ఇలా ఉన్నాయి. 2008-414, 2009-332, 2010-287, 2011-392, 2012-358, 2013-461, 2014-371, 2015-372, 2016-284, 2017-290, 2018-455, 2019-416, 2020-200, 2021-114, 2022-232, 2023-104, 2024లో 161 రన్స్ చేశారు.

News March 21, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔GET READY.. రేపే టెన్త్ పరీక్షలు✔టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి:MEOలు✔తాగునీటి తలెత్తకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్లు✔ముగిసిన ఇంటర్ పరీక్షలు✔NGKL:SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరం✔MBNR:కేంద్ర మంత్రిని కలిసిన MP,MLA✔సీఎం రేవంత్ రెడ్డి విప్లవ నాయకుడు: మల్లు రవి✔పాలెంలో అంబులెన్స్ దగ్ధం✔NGKL: ఘనంగా బంజారాల హోలీ సంబరాలు

News March 21, 2025

బిల్లులు ఆమోదం.. నాగర్ కర్నూల్ ఎంపీ హర్షం 

image

తెలంగాణ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించబడింది. ఈ చారిత్రక నిర్ణయాన్ని పురస్కరించుకొని, ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఎంపీ డాక్టర్ మల్లు రవి సహచర ఎంపీలతో కలిసి బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి సంబరాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ ఎన్నికల హామీ నెరవేరిందని, సామాజిక న్యాయ సాధనంలో ఇది కీలక ముందడుగని అన్నారు.

error: Content is protected !!