News March 14, 2025
టెన్త్ పరీక్షలపై జేసీ సమీక్ష..అధికారులకు పలు సూచనలు

జిల్లా వ్యాప్తంగా ఈనెల 17 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకుంటూ సజావుగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి అధికారులను ఆదేశించారు. గురువారం 10వ తరగతి పరీక్షల నిర్వహణ సన్నద్ధతపై అధికారులతో జేసీ సమీక్షించారు. 19,217 మంది విద్యార్థులకు 110 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు.
Similar News
News February 11, 2026
తిరుపతి : 12వ తేదీన కిసాన్ మేళా

తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (RARS) నందు ఈ నెల 12వ తేదీ కిసాన్ మేళా జరుగుతుందని ఆ కార్యాలయం పేర్కొంది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలియజేశారు. సమగ్ర వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు ఉంటుందని పేర్కొన్నారు. రైతులు హాజరై కిసాన్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 11, 2026
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారా?

TG: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు మార్చి 1 నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు HYD పోలీసులు తెలిపారు. DL లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తించదని పేర్కొన్నారు. లైసెన్స్ లేనివారు RTA కార్యాలయం నుంచి తీసుకోవాలని సూచించారు.
* మైనర్లకు వాహనం ఇవ్వకపోవడం ఉత్తమం.
News February 11, 2026
అయ్యప్ప దీక్షతో ఆరోగ్య రహస్యాలు

అయ్యప్ప దీక్ష ఆత్మస్థైర్యానికి శిక్షణ. సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. క్షవరం చేయకపోవడం దేహంపై మోహాన్ని తగ్గించి, చలి నుంచి రక్షణనిస్తుంది. వేడిని గ్రహించే నలుపు వస్త్రాలు వైరాగ్యానికి ప్రతీకలు. పాదరక్షలు విడిస్తే కష్టాలు తట్టుకునే కఠినత్వం అలవడుతుంది. ఇలా ప్రతి నియమం భక్తుడిని శారీరక దృఢత్వం, ఆధ్యాత్మిక ఉన్నతి వైపు నడిపిస్తుంది.


