News March 20, 2025

టెన్త్ పరీక్షలు.. జిరాక్స్ సెంటర్ల బంద్ చేయాలి: వరంగల్ సీపీ

image

పదో తరగతి పరీక్షల సందర్భంగా పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉండవద్దని సీపీ సన్ ప్రీత్ సింగ్ అదేశించారు. ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్ల వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ముఖ్యంగా పరీక్ష కేంద్ర పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News September 15, 2025

‘జిల్లాలో పంటలకు సరిపడా యూరియా నిల్వలున్నాయి’

image

జిల్లాలో ఆయా పంటల సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. బోయినపల్లి మం. కొదురుపాకలోని రైతువేదికలో సోమవారం రైతులకు యూరియా పంపిణీ చేస్తుండగా ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టోకెన్ పద్ధతి, ఎరువుల పంపిణీని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆయా పంటలసాగుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు యూరియా స్టాక్ తెప్పిస్తున్నామన్నారు. రైతులు ఆందోళన చెందొద్దన్నారు.

News September 15, 2025

వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు ఏమందంటే?

image

* <<17714335>>వక్ఫ్<<>> భూముల ఆక్రమణపై కలెక్టర్‌దే తుది నిర్ణయమన్న ప్రొవిజన్‌‌పై SC స్టే విధించింది. ట్రిబ్యునల్/కోర్టు మాత్రమే డిసైడ్ చేయాలంది.
* సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరుల సంఖ్య 4, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో 3కు మించొద్దని చెప్పింది.
* స్టేట్ బోర్డుకు నాన్-ముస్లిం CEO కావొచ్చన్న ప్రొవిజన్‌పై స్టే విధించలేదు. కానీ వీలైనంత వరకు ముస్లింనే నియమించాలంది.
* రిజిస్ట్రేషన్‌ రూల్‌లో కోర్టు జోక్యం చేసుకోలేదు.

News September 15, 2025

జగిత్యాల: ‘పీఏసీఎస్ పదవీకాలం పొడిగించాలి’

image

జగిత్యాల జిల్లాలోని 23 పీఎసీఎస్ సొసైటీల బోర్డుల పదవీకాలం పొడిగించాలని కోరుతూ జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్‌కు సోమవారం బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. బోర్డుల పదవీకాలం ముగిసినందున కొత్త ఎన్నికలు జరిగే వరకు చైర్మన్లు, డైరెక్టర్లను కొనసాగించాలని కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.