News January 28, 2025
టెన్త్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: నిర్మల్ కలెక్టర్

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పరీక్షా ఫలితాల వివరాలను అందజేయాలని, వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Similar News
News November 28, 2025
విశాఖ: రూ.కోట్లలో మోసానికి పాల్పడ్డ కానిస్టేబుల్!

విశాఖలో క్రిప్టో కరెన్సీ కలకలం రేపింది. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ రూ.3లక్షలు పెడితే నెలకు రూ.50 వేలు వస్తాయని నమ్మించి రూ.కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది పోలీసులు లాభాలు వస్తాయని నమ్మి మోసపోయినట్లు సమాచారం. ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
News November 28, 2025
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు కలెక్టర్ శ్రీజ పర్యటన

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని అదనపు కలెక్టర్ శ్రీజ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఆమె ఆసుపత్రిలో జరుగుతున్న సదరం భవన నిర్మాణ పురోగతిని, అలాగే వివిధ సివిల్ పనుల పురోగతిని నిశితంగా పరిశీలించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిని మరింత మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ సూచించారు.
News November 28, 2025
శంషాబాద్: సమతా స్ఫూర్తి కేంద్రంలో 30న ఈక్వాలిటీ రన్

శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూర్తి కేంద్రం వద్ద ఈనెల 30న ఈక్వాలిటీ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో రన్ ఫర్ ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.హాఫ్ మారథాన్, 10కే, 5కే, 3కే విభాగాల్లో పరుగు ప్రారంభం అవుతుందన్నారు.


