News January 28, 2025

టెన్త్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: నిర్మల్ కలెక్టర్

image

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పరీక్షా ఫలితాల వివరాలను అందజేయాలని, వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Similar News

News October 15, 2025

MBNR: బీసీలందరూ ఐక్యంగా పోరాడాలి: తీన్మార్ మల్లన్న

image

బీసీలందరూ ఐక్యంగా పోరాడాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, MLC తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ఈరోజు MBNRలో TRP ఆధ్వర్యంలో ఎర్ర సత్యంకు ఘన నివాళులర్పించారు. అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీసీలందరం ఏకతాటిపైకి వస్తేనే రాజ్యాధికారం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక నాయకులు, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

News October 15, 2025

HYD: బైక్‌ మీద వెళితే.. కుక్కలతో జాగ్రత్త!

image

టూ వీలర్‌పై వెళుతున్నపుడు వాహనం కంట్రోల్‌లో ఉండాలి. కుక్కలు కూడా సిటీలో వాహనచోదకులను ఇబ్బంది పెడుతున్నాయి. వీధి కుక్కలు అప్పుడప్పుడు రోడ్లపై సడన్‌గా బండికి అడ్డంగా వస్తుంటాయి. అప్పుడు బైక్ కంట్రోల్ కాకపోతే ప్రమాదాలకు గురవుతాం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ఇలా నిన్న తుకారాంగేట్ వద్ద ప్రాణాలు కోల్పోయింది అడ్డగుట్టకు చెందిన స్వప్న (42). భర్తతో కలిసి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సో.. జాగ్రత్త.

News October 15, 2025

HYDలో నాసిరకం నర్సింగ్!

image

నాసిరకం సౌకర్యాలు.. అంతంత మాత్రమే బోధన.. ఇదీ నర్సింగ్ స్కూళ్ల నిర్వాహకుల నిర్వాకం. దీంతో పలువురు నర్సింగ్ స్కూళ్ల వ్యవహారంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో నర్సింగ్ కౌన్సిల్ తనిఖీలకు ప్రత్యేకంగా కమిటీలను నియమించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కళాశాలలపైనే ఎక్కువగా ఫిర్యాదులందాయి. కమిటీ స్కూళ్లల్లో తనిఖీలు నిర్వహించి సర్కారుకు నివేదిక ఇవ్వనుంది.