News March 21, 2025

టెన్త్ విద్యార్థుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు: డీఈఓ

image

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకునేందుకు కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగిందని డిఈఓ రేణుకా దేవి తెలిపారు. విద్యార్థులకు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం 08416 235245 నంబర్‌ను సంప్రదించాలన్నారు. 9 గంటలలోగా పరీక్ష కేంద్రాల్లోకి చేరుకోవాలని 5 నిమిషాలు అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని చెప్పారు.

Similar News

News October 26, 2025

ASF: ఢిల్లీకి చేరిన జాబితా.. ఎవరి ధీమా వారిదే!

image

తెలంగాణ రాష్ట్ర డీసీసీల జాబితా ఢిల్లీకి చేరింది. CM రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో డీసీసీల జాబితాను ఢిల్లీ పెద్దలకు అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ పదవిపై ఎవరి ధీమా వారికే ఉంది. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ఎవరికి వారే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News October 26, 2025

కాకినాడ: విద్యాసంస్థలకు ఐదు రోజుల సెలవులు

image

తుపాను నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు 26వ తేదీ సాయంత్రం నాటికి ఇళ్లకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ ఐదు రోజులు ఏ ఒక్క విద్యాసంస్థ తెరిచి ఉండకూడదని, కళాశాలలకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

News October 26, 2025

అష్ట ధర్మములు ఏవంటే?

image

1. యజ్ఞాలు చేయడం, 2. వేదాలు చదవడం,
3. దానాలు చేయడం, 4. తపస్సు చేయడం,
5. సత్యాన్నే పలకడం, 6. సహనం పాటించడం,
7. కష్ట సమయాల్లో నిలకడ, ధైర్యంగా ఉండటం,
8. వివేకం, ముందుచూపుతో వ్యవహరించడం.
ఈ ఎనిమిది ధర్మాలను పాటించడం వలన మనిషి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ, ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
<<-se>>#Sankhya<<>>