News March 21, 2025

టెన్త్ విద్యార్థుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు: డీఈఓ

image

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకునేందుకు కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగిందని డిఈఓ రేణుకా దేవి తెలిపారు. విద్యార్థులకు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం 08416 235245 నంబర్‌ను సంప్రదించాలన్నారు. 9 గంటలలోగా పరీక్ష కేంద్రాల్లోకి చేరుకోవాలని 5 నిమిషాలు అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని చెప్పారు.

Similar News

News November 16, 2025

వైసీపీపై చట్టపరమైన చర్యలు: జనసేన

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్ పేషీలో లేని సురేశ్ అనే వ్యక్తి పేషీలో పనిచేస్తూ అవినీతికి పాల్పడినట్లు YCP తప్పుడు ఆరోపణలు చేసిందని జనసేన మండిపడింది. YCPపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు Xలో పోస్ట్ చేసింది. ‘పవన్ కళ్యాణ్ నిబద్ధత, పారదర్శకతపై అనుమానం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేసిన వారిపై, వాటిని ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాం’ అని పేర్కొంది.

News November 16, 2025

సివిల్స్‌కు ఉచిత కోచింగ.. దరఖాస్తుల ఆహ్వానం

image

డా. బి.ఆర్. అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ద్వారా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్-2026, మెయిన్స్‌కు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు అర్హులని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 340 సీట్లు ఉన్నాయన్నారు. అభ్యర్థులు నవంబర్ 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 16, 2025

మెంటార్‌ని ఎంచుకుంటున్నారా?

image

మీరు రాణించాలనుకొనే రంగంలో సీనియర్లను మెంటార్‌గా ఎంచుకొనే ముందు వారు నిజంగా మీకు మార్గం చూపించడానికి తగిన వారేనా అన్నది గుర్తించాలి. వారిలో ఏ అంశం మిమ్మల్ని ప్రభావితం చేస్తుందో గమనించాలి. అపజయాలు పొందిన వాళ్లనీ మార్గదర్శకుడిగా ఎన్నుకుంటే వారి తప్పుల గురించి తెలుసుకోవచ్చు. మెంటార్ శభాష్ అని వెన్ను తట్టడమే కాకుండా, తప్పు చేస్తున్నప్పుడు నిర్మొహమాటంగా తగదని మందలించే వారై ఉండాలి.