News December 15, 2024
టెన్షన్.. టెన్షన్.. పులి ఎక్కడ?
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం బురదకోట రిజర్వ్ఫారెస్ట్లో కనిపించిన పులి జాడ ఇంకా లభ్యం కాలేదు. అధికారులు వారం రోజులుగా ట్రాప్ కెమెరాల ద్వారా గాలింపు చేస్తున్నా ఎక్కడా చిక్కలేదు. దీంతో పులి వేరే ప్రాంతానికి తరలి వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమీప ఏజెన్సీ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పులి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని అటవీశాఖ సిబ్బంది ప్రజలకు కోరారు.
Similar News
News January 14, 2025
తూ.గో : ఒక్క రోజులో రూ. 28.40 కోట్లకు తాగేశారు
తూ.గో జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సమరానికి సై అంటూ పౌరుషం చూపుతున్న పుంజులు , మరో వైపు కాయ్ రాజా కాయ్ అంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పందెం రాయుళ్లతో మన గోదావరి జిల్లా ఉత్కంఠ భరితంగా మారింది. అయితే ఇంత బిజీ నడుమ మద్యం ప్రియులు మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేదాడి కన్నా ఈ ఏడాది రెట్టింపుగా భోగి రోజే రూ. 28.40 కోట్లకు మద్యం తాగేసినట్లు సమాచారం.
News January 14, 2025
తూ.గో : ఒక్క రోజులో రూ. 28.40 కోట్లకు తాగేశారు
తూ.గో జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సమరానికి సై అంటూ పౌరుషం చూపుతున్న పుంజులు , మరో వైపు కాయ్ రాజా కాయ్ అంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పందెం రాయుళ్లతో మన గోదావరి జిల్లా ఉత్కంఠ భరితంగా మారింది. అయితే ఇంత బిజీ నడుమ మద్యం ప్రియులు మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేదాడి కన్నా ఈ ఏడాది రెట్టింపుగా భోగి రోజే రూ. 28.40 కోట్లకు మద్యం తాగేసినట్లు సమాచారం.
News January 14, 2025
తూ.గో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆత్మహత్య
తూ.గో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కొల్లే రాజుకుమార్ (38) లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన రాజ్ కుమార్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. అయితే భార్యతో మనస్పర్థల కారణంగా గత 8 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. బొమ్మూరు ఎస్సై ప్రియ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.