News March 25, 2025
టేకుమట్ల: ఘోర రోడ్డు ప్రమాదం (UPDATE)

టేకుమట్ల మండలంలోని రామకృష్ణాపూర్(టి) సమీపంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదంలో వరి పొలంలో పనికి సిద్ధమవుతున్న కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ క్రమంలో మోకిడి సంధ్య (30), పూలమ్మ (51) అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబంలో ప్రేమానురాగాలు పంచే తల్లులు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి పిల్లల రోదనలు మిన్నంటాయి.
Similar News
News November 14, 2025
పరకామణి కేసు.. అతడిది హత్యే!

AP: తిరుమల పరకామణి కేసులో <<18284340>>మృతి<<>> చెందిన మాజీ AVSO సతీశ్ది హత్యేనని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఫోరెన్సిక్, పోలీసుల పర్యవేక్షణలో మృతదేహానికి సిటీ స్కాన్ చేయగా అతడి తల వెనుక గొడ్డలి తరహా ఆయుధంతో నరికినట్లు గుర్తించారు. పరకామణి కేసులో ఫిర్యాదుదారు అయిన సతీశ్ CID ముందు రెండోసారి విచారణకు వస్తూ హత్యకు గురయ్యారు. కోమలి రైల్వే పట్టాల సమీపంలో ఆయన శవమై కనిపించారు.
News November 14, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ రేపు కొత్తగూడెంలో ఐక్యత పాదయాత్ర
✓ గంజాయిపై యుద్ధం ఇది ఆరంభం మాత్రమే: భద్రాద్రి ఎస్పీ
✓ పాల్వంచ ఎమ్మార్వో కార్యాలయాన్ని తనిఖీ చేసిన ట్రైనీ కలెక్టర్
✓ కొత్తగూడెం: ఠాణాపై దాడి కేసులో పదేళ్ల జైలు
✓ పాల్వంచ: జిల్లా స్థాయి ఆర్చరీ టీం ఎంపికలు
✓ అటవీ భూముల సంరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్
✓ అశ్వాపురం: ట్రాక్టర్ బోల్తా ఘటనలో వ్యక్తి మృతి
News November 14, 2025
బాల కార్మిక రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాలి: కలెక్టర్

బాపట్లను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల కార్మికుల గుర్తింపుపై చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు పనితీరు మెరుగుపరచాలని సూచించారు. ఈ-శ్రమ్ పోర్టల్లో కార్మికుల నమోదు వేగవంతం చేయాలని పేర్కొన్నారు.


