News March 19, 2025
టేకుమట్ల: రూ.10 లక్షల బీమా చెక్కు అందజేత

టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన సొల్లేటి రాములు ప్రమాదవశాత్తు గతేడాది వాగులో పడి మృతి చెందాడు. కాగా పోస్ట్ ఆఫీసులో ప్రమాద బీమా చేయించుకున్న రాములు కుటుంబ సభ్యులకు మంగళవారం పోస్టల్ సూపరింటెండెంట్ హనుమంతు, రామకృష్ణ, స్పెషల్ ఆఫీసర్ శైలజ, ఎంపీడీవో అనిత, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీశ్ చేతుల మీదుగా రూ.10 లక్షల బీమా చెక్కును అందజేశారు. బీమాతో కుటుంబం ధీమాగా ఉంటుందన్నారు.
Similar News
News September 18, 2025
వేలూరు సీఎంసీలో ఎన్టీఆర్ వైద్య సేవ లేనట్లేనా..?

చిత్తూరు జిల్లా నిరుపేదలు చాలామంది వేలూరు CMC ఆసుపత్రికి వెళ్తుంటారు. క్రిటికల్ కేర్, యాక్సిడెంట్స్, ఇతర ఏ సమస్యలు వచ్చిన ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఈ ఆసుపత్రే. ఇది తమిళనాడులో ఉండటంతో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలు కావడం లేదు. రూ.లక్షల్లో బిల్లులతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోంది.
News September 18, 2025
రేపు OTTలోకి ‘మహావతార్ నరసింహ’

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ సినిమా OTT రిలీజ్ డేట్ ఖరారైంది. రేపటి నుంచి Netflixలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మహా విష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. జులై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
News September 18, 2025
పలు ఆలయాల బోర్డులకు ఛైర్మన్ల నియామకం

AP: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది.
1.శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం(శ్రీశైలం)- P.రమేశ్ నాయుడు
2.శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం- కొట్టె సాయి ప్రసాద్
3.శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం(కాణిపాకం)- V.సురేంద్ర బాబు
4.శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం(ఇంద్రకీలాద్రి)- B.రాధాకృష్ణ
5.శ్రీ వేంకటేశ్వర ఆలయం(వాడపల్లి)- M.వెంకట్రాజు