News March 26, 2025
టేకులపల్లిలో వడదెబ్బకు రైతు మృతి

వడదెబ్బతో రైతు మృతి చెందిన ఘటన టేకులపల్లి మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మద్రాస్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో గల కొండంగుల బోడుకి చెందిన కేలోతు గోబ్రియా అనే రైతు వడదెబ్బతో మృతి చెందారు. ఆయన సోమవారం తన పొలంలో పండించిన కూరగాయలు, నువ్వులు కోయడానికి వెళ్లి ఎండ దెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద మృతి చెందాడు.
Similar News
News October 24, 2025
అరటి, కొబ్బరి ఉత్పత్తులకు ఇంక్యుబేషన్ కేంద్రాలు: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెం సమీపంలో అరటి, అమలాపురం పరిసర ప్రాంతాలలో కొబ్బరి ఉత్పత్తుల తయారీపై శిక్షణ, ఉత్పత్తుల ప్రోత్సాహకం కోసం ఇంక్యుబేషన్ కేంద్రాలు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఉద్యాన విశ్వవిద్యాలయం, ఫుడ్ ప్రాసెసింగ్ శాస్త్రవేత్తలు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి, ఇంక్యుబేషన్ సెంటర్ల వారితో చర్చించారు.
News October 24, 2025
వరంగల్: రైతులకు నిరాశ.. తగ్గిన మిచ్చి ధరలు..!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారంతో పోలిస్తే శుక్రవారం అన్ని రకాల మిర్చి ధరలు తగ్గాయి. తేజా మిర్చి క్వింటాకు గురువారం రూ.14,300 ధర పలకగా.. నేడు రూ.14,000 ధర వచ్చింది. అలాగే, 341 రకం మిర్చి గురువారం రూ.15,849 ధర వస్తే.. శుక్రవారం రూ.15,500 అయింది. వండర్ హాట్(WH) మిర్చి నిన్న రూ.16,800 ధర వస్తే.. నేడు రూ.16,100కి పడిపోయింది.
News October 24, 2025
MDK: ‘ఆశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకం’

రాజీవ్ యువ వికాస పథకం నిరుద్యోగ యువతను ఆశపెట్టిందని చెప్పొచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. దీంట్లో సిబిల్ స్కోర్ను బట్టి లబ్దిదారుల ఎంపిక నిర్వహిస్తున్నారు. ఐతే ఇప్పటికీ ఈ పథకం పై లబ్ధిదారుల వివరాలు అధికారులు తెలపలేదు. ఈ పథకం ద్వారా సొంత వ్యాపార నిమిత్తం రూ.5 లక్షల రుణం ప్రభుత్వం ఇస్తుంది. ఆశ పెట్టి వదిలేశారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.


