News May 24, 2024

టేక్మాల్‌‌: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి.. కేసు నమోదు

image

వైన్స్ ముందు అనుమానాస్పదంగా వ్యక్తి మృతిచెందిన ఘటన టేక్మాల్‌‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన గుంటి రాజు(30) టేక్మాల్‌లోని కొనుగోలు కేంద్రానికి వడ్లు అమ్మడానికి తీసుకొచ్చాడు. రాత్రి ఇంటికి రాకపోగా శుక్రవారం ఉదయం టేక్మాల్ వైన్స్ ముందు విగతజీవిగా పడి ఉన్నాడని బంధువుల పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Similar News

News February 9, 2025

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపిస్తే చెప్పండి: మెదక్ పోలీసులు

image

పై ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని మెదక్ జిల్లా పోలీసులు సూచించారు. మెదక్ మండల కేంద్రంలోని ఒకటో నంబర్ కల్లు దుకాణంలో మహిళను మభ్యపెట్టి ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకుని పరారైన దుండగుడి ఫోటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తిస్తే సంబంధిత పోలీస్ శాఖకు సమాచారం అందించాలని సూచించారు.

News February 9, 2025

డ్రామాలో బుడాన్ ఖాన్ కేసీఆర్: ఎంపీ రఘునందన్

image

డ్రామాలో బుడాన్ ఖాన్ కథ లెక్క కేసీఆర్ తీరు ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం మెదక్‌లో పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడారు. బీజేపీ బలపర్చిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులున్నారు.

News February 9, 2025

మాసాయిపేట: తల్లి మృతితో అనాథలైన పిల్లలు.. ఆదుకోండి

image

మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన వెంగలి అనిత(35) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. నాలుగేళ్లు క్రితం భర్త కర్ణ చనిపోవడంతో కుటుంబాన్ని ఆమె నెట్టుకొస్తుంది. తాజాగా అనిత మృతితో మానసిక దివ్యాంగులైన వారి ఇద్దరి పిల్లలు అనాథలుగా మిగిలారు. అంత్యక్రియలకు సైతం స్థోమత లేని స్థితిలో ఉన్నారని, దాతలు స్పందించి ఆ కుటంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

error: Content is protected !!