News September 1, 2024

టోర్నమెంట్‌ నిర్వహణ గొప్ప అవకాశం: మాంఛో ఫెర్రర్‌

image

అనంతపురం జిల్లాలో దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించడం గొప్ప అవకాశం అని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) త్రీమెన్‌ కమిటీ సభ్యుడు మాంఛో ఫెర్రర్‌ అన్నారు. శనివారం ఆయన టికెట్ల పంపిణీతో పాటు స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాంఛో ఫెర్రర్‌ మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్ ప్రేమికులకు ఇదొక అరుదైన అనుభూతినిచ్చే వేడుకని, జాతీయ క్రీడాకారులకు అత్యంత కీలకమైనదని అన్నారు.

Similar News

News February 9, 2025

బ్రహ్మసముద్రం: పురుగు మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య

image

బ్రహ్మసముద్రంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని బొమ్మగానిపల్లి తండా గ్రామంలో లక్ష్మీబాయి అనే వృద్ధురాలు శనివారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 9, 2025

అదుపుతప్పి కారు బోల్తా.. మహిళ మృతి

image

కర్నూలు(D) వెల్దుర్తిలోని మంగంపల్లి సమీపాన శనివారం కారు బోల్తాపడి మహిళ మృతిచెందింది. సత్యసాయి(D) బత్తలపల్లి(M) గుమ్మలకుంటకు చెందిన పవన్ కుమార్ రెడ్డి, మహేశ్వరి(32) HYDలో ఉంటున్నారు. తమ్ముడి వివాహానికి ఏడాదిన్నర కుమారుడు వియాన్స్‌, మరిది అమర్‌నాథ్‌తో కలిసి కారులో బయలుదేరారు. మంగంపల్లి వద్ద కుక్క అడ్డురావడంతో బోల్తాపడింది. తన ఒడిలో ఉన్న వియాన్స్‌ను అదిమి పట్టుకుని ప్రాణాలు కాపాడి, తాను మృతిచెందింది.

News February 9, 2025

పేరూరు గ్రామం నుంచి తిరుమలకు పాదయాత్ర

image

పేరూరు గ్రామం నుంచి తిరుమలకు పంచాగం మోహన్ స్వామి ఆధ్వర్యంలో భక్తులు శనివారం పాదయాత్రను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి మాల ధరించిన భక్తులు గ్రామంలోని ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసి, భజన చేసుకుంటూ తిరుమలకు పాదయాత్ర చేస్తామన్నారు. కార్యక్రమంలో దాసరి రాజ, వెంకటరెడ్డి, బెస్త నాగరాజు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!