News March 13, 2025
ట్యాంక్ పైనుంచి దూకి యువకుడి సూసైడ్

సంజామల మండలం ఎగ్గోనిలో తాగునీటి సరఫరా కోసం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ పైనుంచి దూకి యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా ముద్దనూరు మండలం ఉప్పలూరుకు చెందిన కర్నాటి హర్షవర్ధన్ రెడ్డి(30) ఎగ్గోనిలోని తన సోదరి ఇంటికి 2 రోజుల క్రితం వచ్చాడు. అయితే మద్యానికి బానిసగా మారి, ఆరోగ్యం చెడిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 24, 2026
నస్పూర్: పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు

జిల్లాలో ఇంటర్, పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు హైదరాబాద్ నుంచి అదనపు డీజీపీ మహేశ్ భగవత్, అధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News February 24, 2026
రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వేగవంతం చేయాలని తెలిపారు. రానున్న 3 రోజుల్లో ప్రోగ్రెస్ను మరింతగా పెంచేలా ఈఆర్వోలు పర్యవేక్షించాలన్నారు. డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీస్ నిర్దేశిత మార్గదర్శకాలు పాటిస్తూ 100 శాతం పూర్తి చేయాలన్నారు.
News February 24, 2026
కేయూ: ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షల రీషెడ్యూల్

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఇటీవల వాయిదా పడిన పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల కొత్త తేదీలను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల మంగళవారం ప్రకటించారు. ఎం.బి.ఎ. మొదటి సెమిస్టర్ పరీక్షలు మార్చి 6 నుంచి ప్రారంభమై 24వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. మ.2 గంటల నుంచి సా. 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, గతంలో కేటాయించిన కేంద్రాలలోనే విద్యార్థులు హాజరు కావాలని సూచించారు.


