News March 19, 2025
ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంటకు మొదటి స్థానం

ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంట మున్సిపాలిటీ 100% లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అయాజ్ మాట్లాడుతూ.. ఈ ఘనత ప్రజల సహకారంతోనే సాధ్యమైందని.. అధికారులు, సిబ్బంది ముందుగా కార్యచరణ రూపొందించుకొని సమర్థవంతంగా పనిచేయడంతోనే ఈ లక్ష్యాన్ని సాధించామన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు.
Similar News
News April 23, 2025
కరీంనగర్ జిల్లాలో మండుతున్న ఎండలు

కరీంనగర్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటల తరువాత ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర, మానకొండూర్ మండలాల్లో 44.0°C నమోదు కాగా, కొత్తపల్లి, చొప్పదండి 43.8, కరీంనగర్, జమ్మికుంట 43.7, శంకరపట్నం 43.6, రామడుగు, ఇల్లందకుంట, తిమ్మాపూర్ 43.5, వీణవంక 43.4, గన్నేరువరం, కరీంనగర్ రూరల్ 43.3, చిగురుమామిడి 43.1, సైదాపూర్ 42.8, హుజూరాబాద్ 42.2°C గా నమోదైంది.
News April 23, 2025
KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

తిమ్మాపూర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మే 5 నుంచి మగ్గం వర్క్స్, మే 8 నుంచి టైలరింగ్ పై ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ. సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు 18 నుంచి 45 సంవత్సరాల వారు అర్హులు అవుతారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు మే 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ శిక్షణ 31 రోజులు ఉంటుందని అన్నారు.
News April 22, 2025
ఇంటర్ ఫలితాల్లో అల్ఫోర్స్ ప్రభంజనం

ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ అల్ఫోర్స్ జూనియర్ కాలేజీ ప్రభంజనం సృష్టించిందని అల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ వి.నరేందరెడ్డి తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం MPC విభాగంలో S.లహరి 468, హప్సహస్నాన్ 468, తహూరా నూర్ 468 మార్కులు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో K.రుత్విక్ 996, శ్రీనిత్యరెడ్డి 995, రుత్విక 995 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సత్తాచాటారని ఆయన ప్రకటించారు.