News December 23, 2024
ట్రాన్స్జెండర్ నుంచి ట్రాఫిక్ పోలీస్.. ఆ కథ ఇదే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734940935101_71657444-normal-WIFI.webp)
మొన్నటి వరకు ట్రాన్స్జెండర్స్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. నేడు గౌరవ వృత్తిలోకి వచ్చారు. ఏకంగా ఖాకీ చొక్కా ధరించి, HYD ట్రాఫిక్ విధుల్లో ఉన్నారు. వీరిని ట్రాఫిక్ విధుల్లోకి తీసుకోవాలన్న ఆలోచన మాత్రం సీఎం రేవంత్ దే. వాహనంలో వెళ్లే సమయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేయడం గమనించానని సీఎం ప్రకటించారు. ట్రాఫిక్పై పట్టు ఉండే వీరికి ట్రాఫిక్ జాబ్ ఇవ్వాలని ఆరోజే సీఎం భావించారట.
Similar News
News February 5, 2025
మోకిల: స్కూల్ బస్సును ఢీకొని IBS విద్యార్థి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738772614933_1260-normal-WIFI.webp)
స్కూల్ బస్సును బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మోకిల PS పరిధిలో జరిగింది. CI వీరబాబు వివరాలు ప్రకారం.. శంకర్పల్లి మండల IBS కాలేజీలో Btech చదివే విద్యార్థులు బొడ్డు శ్రీహర్ష (19), హర్ష నందన్ వేదాంతం (19) ఇద్దరు బైక్పై కొండకల్ నుంచి మోకిలకు వస్తుండగా ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఢీకొని శ్రీహర్ష అక్కడికక్కడే చనిపోయాడు. హర్ష నందన్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 5, 2025
గొంగడి త్రిషకు HCA నజరానా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738770229718_52296546-normal-WIFI.webp)
మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్లో సత్తా చాటిన క్రికెటర్ గొంగడి త్రిషకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నజరానా ప్రకటించింది. త్రిషకు రూ.10 లక్షలు, ఆమె హెడ్ కోచ్కు రూ.5 లక్షలు, ట్రైనర్ శాలినికి రూ.5 లక్షల నజరానా ప్రకటించింది. మరోవైపు ఆమెకు సీఎం రేవంత్ రూ.కోటి నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే.
News February 5, 2025
HYD: బాలికతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738750338333_52296546-normal-WIFI.webp)
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కిరణ్ అనే యువకుడికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్డు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాలిలా.. సరూర్ నగర్ పరిధికి చెందిన కిరణ్ ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన 2020లో జరగ్గా కేసు నమోదైంది. తాజాగా కోర్టు శిక్ష విధించింది.