News March 19, 2025

ట్రాన్స్‌జెండర్ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

image

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ దారుణ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం.. అక్కడి నుంచి అనకాపల్లి ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సీఎంకు తెలిపారు. కాగా ట్రాన్స్‌జెండర్‌ను చంపి ముక్కలుగా నరికి మూట కట్టి కశింకోట(M) బయ్యవరం వద్ద పడేసిన సంగతి తెలిసిందే.

Similar News

News November 18, 2025

తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ జిల్లా ఇన్‌‌ఛార్జ్‌గా రవీందర్

image

తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌‌ఛార్జ్‌గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బాశెట్టి రవీందర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రవీందర్‌ను ఆర్యవైశ్య సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు బుస్స దశరథం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా రవీందర్ అన్నారు. సంఘం నాయకులు నగుబోతు రవీందర్, కట్కం కిషన్, చికోటి నాగరాజు, పాత మహేష్ పాల్గొన్నారు.

News November 18, 2025

తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ జిల్లా ఇన్‌‌ఛార్జ్‌గా రవీందర్

image

తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌‌ఛార్జ్‌గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బాశెట్టి రవీందర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రవీందర్‌ను ఆర్యవైశ్య సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు బుస్స దశరథం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా రవీందర్ అన్నారు. సంఘం నాయకులు నగుబోతు రవీందర్, కట్కం కిషన్, చికోటి నాగరాజు, పాత మహేష్ పాల్గొన్నారు.

News November 18, 2025

అమిత్ షా డెడ్‌లైన్‌కి ముందే హిడ్మా ఎన్‌కౌంటర్!

image

AP: అల్లూరి(D) మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్‌లైన్‌ కంటే ముందే ఇది జరిగిందని తెలుస్తోంది. 2026 మార్చి 31నాటికి దేశంలో నక్సలిజాన్ని రూపుమాపాలని అమిత్ షా గడువు విధించిన విషయం తెలిసిందే. అప్పుడే NOV 30లోపు హిడ్మా ఎన్‌కౌంటర్ జరగాలని ఆదేశాలిచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి.