News March 19, 2025

ట్రాన్స్‌జెండర్ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

image

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ దారుణ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం.. అక్కడి నుంచి అనకాపల్లి ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సీఎంకు తెలిపారు. కాగా ట్రాన్స్‌జెండర్‌ను చంపి ముక్కలుగా నరికి మూట కట్టి కశింకోట(M) బయ్యవరం వద్ద పడేసిన సంగతి తెలిసిందే.

Similar News

News November 28, 2025

గజ్వేల్‌లో దారుణం.. అమానుష ఘటన

image

గజ్వేల్ పట్టణంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నాలుగో బిడ్డను సాకలేనని ఓ తల్లి అబార్షన్ మాత్రలు మింగి గర్భస్రావం చేసుకుంది. గర్భస్రావం అనంతరం ఆరు నెలల నెత్తుటి గుడ్డును గజ్వేల్‌లోని రాజిరెడ్డిపల్లి పార్శి కుంట వద్ద పడేశారు. దీంతో స్థానికులు గమనించి నిలదీయడంతో నిజం ఒప్పుకున్నారు. వెంటనే గజ్వేల్ పోలీసులు తల్లి, ఆమెకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చిన ఆర్ఎంపీని అరెస్ట్ చేశారు.

News November 28, 2025

వరంగల్: ఉద్దండులంతా సర్పంచ్‌లే!

image

రాజకీయాలకు ఉమ్మడి WGL పెట్టింది పేరు. గ్రామ నుంచి ఢిల్లీ స్థాయివరకు ఎదిగిన నాయకులు ఎందరో ఉన్నారు. మాజీ మంత్రి DS రెడ్యానాయక్ 1981లో మరిపెడ(M) ఉగ్గంపల్లి సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మాజీ MP సురేందర్ రెడ్డి 1959లో మరిపెడ సర్పంచ్‌గా పనిచేశారు. BHPL MLA గండ్ర సత్యనారాయణ రావు 1984లో గణపురం(M) బుద్దారం సర్పంచ్‌గా, NSPT MLA మాధవరెడ్డి 1981లో చెన్నరావుపేట(M) అమీనాబాద్ సర్పంచ్‌గా చేశారు.

News November 28, 2025

సిరిసిల్ల: ఇంటర్వ్యూ కావాలని పిలిచి.. హతమార్చి..!

image

పీపుల్స్ వార్ పార్టీ మాజీ నక్సలైట్ బల్లెపు నరసయ్య అలియాస్ సిద్ధయ్య(బాపురెడ్డి) <<18408780>>హత్య<<>> ఘటనలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తాను దళంలో ఉన్నప్పుడు చంపినవారి వివరాలను ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడంతో, బాధిత కుటుంబానికి చెందిన జక్కుల సంతోశ్ తనకు ఇంటర్వ్యూ కావాలని సిద్ధయ్యను అగ్రహారం గుట్టల వద్దకు రప్పించి రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.