News March 19, 2025
ట్రాన్స్జెండర్ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్జెండర్ దారుణ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం.. అక్కడి నుంచి అనకాపల్లి ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సీఎంకు తెలిపారు. కాగా ట్రాన్స్జెండర్ను చంపి ముక్కలుగా నరికి మూట కట్టి కశింకోట(M) బయ్యవరం వద్ద పడేసిన సంగతి తెలిసిందే.
Similar News
News November 21, 2025
రాజీనామా యోచనలో కడియం..?

వరంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జూబ్లీహిల్స్ గెలుపు ఊపులో ఉన్న కాంగ్రెస్.. ఫిరాయింపుల విషయంలో రాజీనామా చేయించాలని చూస్తోంది. స్టే.ఘనపూర్ MLAగా ఉన్న కడియం శ్రీహరితో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లి BRSను ఇరుకున పెట్టడానికి CM రేవంత్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇదే వేడిలో ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్కు గ్రౌండ్లో మరింత బలం పెరుగుతుందని భావిస్తున్నారు. 2 రోజుల్లో కడియం రాజీనామా చేసే అవకాశముంది.
News November 21, 2025
1956లో ప్రస్థానం ప్రారంభం.. నేటికి JNTUకి 60 ఏళ్లు

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలకు ముస్తాబైంది. 1965లో నాగార్జున ఇంజినీరింగ్ కళాశాలగా ఆవిర్భవించి 1972లో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్గా అవతరించింది. 2015లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకొని నేడు డైమండ్ జూబ్లీ వేడుకలకు యూనివర్సిటీ కళాశాల సిద్ధమైంది. ఈ 60 ఏళ్లలో ఎన్నో ఘనతలు సాధించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చింది.
News November 21, 2025
నల్గొండ: లంచగొండి అధికారులు.. 11 నెలల్లో 15 కేసులు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న లంచగొండి ప్రభుత్వ అధికారులను ఏసీబీ వలపన్ని పట్టుకుంటూ దడ పుట్టిస్తోంది. నెలనెల లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా కొందరు అధికారులు అత్యాశకు పోయి, ప్రతీ పనికి ధర నిర్ణయించి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది 11 నెలల్లోనే ఉమ్మడి జిల్లాలో సుమారు 15 ఏసీబీ కేసులు నమోదవడం గమనార్హం.


