News March 19, 2025
ట్రాన్స్జెండర్ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్జెండర్ దారుణ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం.. అక్కడి నుంచి అనకాపల్లి ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సీఎంకు తెలిపారు. కాగా ట్రాన్స్జెండర్ను చంపి ముక్కలుగా నరికి మూట కట్టి కశింకోట(M) బయ్యవరం వద్ద పడేసిన సంగతి తెలిసిందే.
Similar News
News March 19, 2025
విశాఖ స్టేడియం ఆవరణలో నిరసన చేస్తాం: గుడివాడ

మధురవాడలో గల అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు వైయస్సార్ పేరు తొలగించడం అన్యాయమని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సాధించాలన్నారు. విశాఖలో వైసీపీ ఆఫీసులో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కూటమి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. క్రికెట్ స్టేడియంకు YSR పేరును తొలగించడం పట్ల నిరసనగా స్టేడియం ఆవరణలో వైసీపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు.
News March 19, 2025
స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతించాలి: కలెక్టర్

ఏప్రిల్ 30న సింహాచలంలో జరిగే చందనోత్సవంకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతించాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్యూలైన్లలో విరివిగా తాగునీటి కేంద్రాలను, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈఓను ఆదేశించారు.
News March 19, 2025
విశాఖలో ఈనెల 24, 30న ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ

విశాఖలో మార్చి 24,30 తేదీలలో జరిగే IPL మ్యాచ్ల నిర్వహణపై CP శంఖబ్రత బాగ్చీ బుధవారం సమీక్షించారు. మ్యాచ్ జరిగే రోజుల్లో విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని CP తెలిపారు. మ్యాచ్ రోజు శ్రీకాకుళం, VZM వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు ఆనందపురం, పెందుర్తి, NAD మీదుగా నగరంలోకి రావాలన్నారు. చిన్న వాహనాలు మారికవలస(లేదా) మిథులాపురి కాలనీ, బీచ్ రోడ్డు, జోడిగుడ్లపాలెం మీదుగా నగరంలోకి వెళ్ళాలని సూచించారు. >Share it