News December 13, 2024
ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు భద్రత కల్పించండి

మరణించిన ఆటోడ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు సామాజిక భద్రత బీమా పథకం రెన్యువల్తోపాటు, వారి కుటుంబాలకు అందించే రూ.5 లక్షలను రూ.10 లక్షలకు పెంచాలని INTUC నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. గురువారం మంత్రిని కలిసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే ప్రమాదంలో అంగవైకల్యం చెందిన డ్రైవర్లకు రూ.3 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని మంత్రిని కోరారు.
Similar News
News November 15, 2025
శంషాబాద్: ఉజ్బెకిస్థాన్ మహిళను డిపార్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు

హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న ఉజ్బెకిస్థాన్ మహిళను అధికారులు డిపార్ట్ చేశారు. వీసా గడువు లేకుండా ఉన్నట్లు గుర్తించిన మిస్ బోడానోవా జిబాష్ను నిన్న రాత్రి ఎఫ్జెడ్–436 విమానం ద్వారా దుబాయ్కు పంపించారు. బంజారాహిల్స్ పోలీస్ సిబ్బంది ఆమెను డిపార్చర్ గేట్ వరకు ఎస్కార్ట్ చేయగా, అనంతరం ఎయిర్లైన్స్ సిబ్బంది, BOI అధికారులు పర్యవేక్షణలో విమానంలోకి ఎక్కించారు.
News November 15, 2025
HYD: ఈనెల 17న ‘మీ డబ్బు-మీ హక్కు’ జిల్లా స్థాయి శిబిరం: కలెక్టర్

‘మీ డబ్బు-మీ హక్కు’లో భాగంగా ఈనెల 17న బాగ్ లింగంపల్లిలోని TGSRTC కళ్యాణ మండపం వద్ద జిల్లా స్థాయి శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా “మీ డబ్బు- మీహక్కు” అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు జాతీయస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.
News November 15, 2025
HYD: పదే పదే లీకేజీలతో.. నీటి సరఫరాలో అంతరాయం

HYD నగరానికి నీటి సరఫరా చేసే జలమండలి పైప్ లైన్లు పదే పదే లీకేజీ కావడంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. 2,3 రోజులపాటు ప్రజల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా జలమండలి తగిన చర్యలు తీసుకోవాలని నగరంలోని సరూర్నగర్, ఉప్పల్, నాంపల్లి, అత్తాపూర్ ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


