News March 18, 2025
ట్రిపుల్ ఐటీలకు మే7 నుంచి వేసవి సెలవులు

రాజీవ్ గాంధీ సాంకేతిక వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (ఆర్జీయుకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీలకు మే 7తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు ఆర్జీయూకేటీ రిజిస్టర్ ఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ తెలిపారు. నూజివీడులో ఆయన సోమవారం మాట్లాడుతూ.. వేసవి సెలవుల అనంతరం జూన్ 30వ తేదీన క్లాసులు పునఃప్రారంభం అవుతాయన్నారు. బాలికలను గమ్యస్థానాలకు చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Similar News
News March 18, 2025
నల్గొండ: మద్దతు ధర పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్

2024 -25 రబీ ధాన్యం మార్కెట్కు రానున్న నేపథ్యంలో రబీ ధాన్యం సేకరణకు పౌరసరఫరాలు, వ్యవసాయ అనుబంధ శాఖలు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణ, మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జిలకు ఉద్దేశించి శనివారం ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు మద్దతు ధర పోస్టర్ ఆవిష్కరణ చేశారు.
News March 18, 2025
జడ్చర్ల బస్టాండ్లో దొంగలు.. జర జాగ్రత్త..!

సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న దొంగలను మంగళవారం జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్లో సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. విజిలెన్స్ సెక్యూరిటీ లింగంపేట శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. బస్టాండ్లో ప్రయాణికుల నుంచి సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా పట్టుబడ్డ నిందితులు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారి నుంచి 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
News March 18, 2025
మహబూబ్నగర్: దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం భవిత సెంటర్లలో ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నట్లు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. మహబూబ్నగర్ పట్టణంలోని సమగ్ర శిక్ష సమావేశ మందిరంలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. భవిత సెంటర్లలో ఇస్తున్న ప్రత్యేక శిక్షణను దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలన్నారు.