News March 20, 2025

ట్రోఫీలు అందుకున్న జిల్లా నేతలు

image

విజయవాడలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రెండు రోజుల పాటు క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో మంత్రి TG భరత్ విన్నర్‌గా నిలిచారు. ఎమ్మిగనూరు MLA నాగేశ్వరరెడ్డి రన్నన్‌గా నిలిచారు. ఇక డబుల్స్‌లో మంత్రి సత్యకుమార్‌తో కలిసి నాగేశ్వరరెడ్డి విన్నర్‌గా నిలిచారు. సింగిల్స్ ఉమెన్స్ పోటీల్లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రన్నర్‌గా నిలిచారు. సీఎం, డిప్యూటీ సీఎం నుంచి వారు ట్రోఫీలు అందుకున్నారు.

Similar News

News October 14, 2025

‘స్కాలర్‌షిప్స్ రాలేదు.. జీతాలు ఇవ్వలేం’

image

TG: ఉన్నత విద్యాసంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు నిలిపివేశాయి. దాదాపు 5 నెలల నుంచి వేతనాలు ఇవ్వట్లేదు. ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్‌లు విడుదల కాలేదని, వచ్చిన తర్వాతే ఇస్తామని తేల్చి చెబుతున్నాయి. ఇప్పటికే 50% కాలేజీలు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయని ఓ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం Way2Newsకు గోడు వెల్లబోసుకుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది అడ్మిషన్లూ కష్టమని ఆందోళన వ్యక్తం చేసింది.

News October 14, 2025

జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. మొత్తం 22 నామినేషన్లు

image

జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో నామినేషన్‌ల స్వీకరణ కొనసాగుతోంది. మొదటి రోజున 10 మంది అభ్యర్థులు 11 నామినేషన్‌లు దాఖలు చేయగా నేడు(2వ రోజు) 11 మంది అభ్యర్థులు 11 నామినేషన్‌లు సమర్పించారు. రెండు రోజుల్లో మొత్తంగా 22 నామినేషన్‌లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈనెల 13 నుంచి 21 వరకు కొనసాగనుంది.

News October 14, 2025

16న శ్రీశైలం వచ్చే భక్తులకు ముఖ్య గమనిక

image

ఈనెల 16న శ్రీశైలం వచ్చే భక్తులు, యాత్రికులకు అధికారులు ముఖ్య విజ్ఞప్తి చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం వైపు వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, దోర్నాల మీదుగా శ్రీశైలం వచ్చే వారు తమ ప్రణాళికను సవరించుకోవాలన్నారు.