News July 13, 2024
డక్కిలి గురుకుల పాఠశాల ఎదుట ఎమ్మార్పీఎస్ ఆందోళన

డక్కిలిలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఎదుట ఎంఆర్పిఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. గురుకుల పాఠశాలలో చదివే ఓ విద్యార్థిని చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గురుకులంలో ఆ విద్యార్థిని అనారోగ్యం గురి కావడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే మృతి చెందిందని, ఇందుకు గురుకుల సిబ్బంది కారణమని ఎమ్మార్పీఎస్ నాయకులు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
Similar News
News October 26, 2025
రేపు PGRS రద్దు: కలెక్టర్

సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం తెలిపారు. మొంథా తుపాన్ కారణంగా సోమవారం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ప్రజా రక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. తుపాను పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News October 26, 2025
కందుకూరులో వృద్ధ దంపతుల ఆత్మహత్య

కందుకూరులో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని కోవూరు రోడ్డులో నివసిస్తున్న వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం పురుగు మందు తాగిన ఇద్దరిని కందుకూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించగా అప్పటికే ఒకరు మరణించారని తెలిసింది. చికిత్స పొందుతూ మరొకరు కూడా మరణించారని సమాచారం. వృద్ధ దంపతుల ఆత్మహత్యకు కారణం ఏమిటన్నది విచారణలో తేలాల్సి ఉంది.
News October 26, 2025
నెల్లూరు: అంతా ఉరుపే.. తడిస్తే మాకేంటి..!

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వెనుక ఉండే పాత భవనంలో సీజనల్ వ్యాధుల నివారణకు అవసరమైన మందులు, బ్లీచింగ్ తదితర వస్తువులు భద్రపరుస్తారు. అయితే ఆ భవనం పాతదై పడిపోయే స్థితిలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు సైతం ఆ భవనం ఉరిసింది. దీంతో అక్కడ ఉన్న సామగ్రి తడిచిపోయింది. ఎంతో విలువైన వాటిని భద్రపరిచేందుకు అక్కడ STORE ROOM సైతం లేకపోవడం గమనర్హం. గతంలో ఎన్నో సార్లు ప్రతిపాదనలు చేసినా కార్యరూపం దాల్చలేదు.


