News July 16, 2024

డక్కిలి గురుకుల ప్రిన్సిపల్ సస్పెండ్

image

డక్కిలిలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఇటీవల అనారోగ్యంతో సరీనా మృతి చెందిన విషయం తెలిసిందే. విధులు సక్రమంగా నిర్వహించలేదని ప్రిన్సిపల్ శ్రీదేవి , హౌస్ టీచర్ వాణి , ఆరోగ్య కార్యకర్త సునీతలను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాల బాలిక మృతిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి కలెక్టరుకు నివేదిక పంపడంతో కలెక్టర్ వారిపై చర్యలు తీసుకున్నారు.

Similar News

News September 14, 2025

నెల్లూరులో యువతి దారుణ హత్య.. UPDATE

image

బుచ్చి(M) పెనుబల్లికి చెందిన గిరిబాబు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి మైథిలీప్రియ (23) బీఫార్మసీ పూర్తి చేసింది. ఆ సమయంలో సహ విద్యార్థి నిఖిల్‌ను ప్రేమించింది. కొన్నాళ్లుగా నిఖిల్‌ మరో యువతితో సన్నిహితంగా ఉండటంపై మైథిలీప్రియ గొడవ పడుతోంది. ఈక్రమంలో ఆమెను మాట్లాడాలని పిలిచి నిఖిల్‌‌ <<17695710>>కత్తితో పొడిచి హత్య<<>> చేశాడు. అనంతరం దర్గామిట్ట పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.

News September 14, 2025

MLA సోమిరెడ్డిపై కాకాణి ఆరోపణలు

image

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో ఆయన పర్యటించారు. ట్రావెల్, మట్టి, ఇసుక, బూడిదను దోపిడీ చేస్తూ సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

News September 13, 2025

కాసేపట్లో కొత్త కలెక్టర్‌ బాధ్యతలు.. సమస్యలు ఇవే.!

image

నెల్లూరు కొత్త కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా శనివారం సా.5.30 గం.కు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనకు పలు కీలక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. GGHలో అధ్వాన పరిస్థితులు, కరేడు భూముల వివాదం, సీజనల్ వ్యాధుల కట్టడి, ఆస్పత్రుల సేవల మెరుగు, పెన్నా పొర్లుకట్టలు, చెరువుల పటిష్టత, ఇసుక అక్రమ రవాణా, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రెవెన్యూ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. వాటిపై ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.