News April 24, 2024

డక్కిలి: దగ్గవోలు హైస్కూల్లో 100 శాతం ఉత్తీర్ణత

image

డక్కిలి మండల పరిధిలోని దగ్గవోలు గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 35 మందికి 35 మంది పాసయ్యారు. ఇందులో కే.శ్రావ్య 600 మార్కులు గాను 519 మార్కులు సాధించి పాఠశాలలో మొదట స్థానంలో నిలిచారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. పాఠశాలకు 100% ఉత్తీర్ణత రావడం సంతోషం అని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

Similar News

News January 16, 2026

నెల్లూరు టీడీపీ నేత మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

image

నెల్లూరు సిటీ టీడీపీ నేత, 42, 43వ క్లస్టర్ ఇంఛార్జ్ మహమ్మద్ జాకీర్ షరీఫ్ మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నెల్లూరు వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో జాకీర్ గాయపడి ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జాకీర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి… వారి కుటుంబంలో విషాదం నెలకొనడం బాధాకరమని అన్నారు.

News January 16, 2026

BREAKING.. నెల్లూరు: బీచ్‌లో నలుగురు గల్లంతు..

image

అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్ర తీరాన ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఒక మృతదేహాన్ని మత్స్యకారులు గుర్తించి సముద్రపు ఒడ్డుకు తీసుకొచ్చారు. మరో ముగ్గురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పండుగ కావడంతో అల్లూరు పంచాయతీకి చెందిన నలుగురు యువకులు ఈతకు వెళ్లి ఆలల ఉధృతికి గల్లంతయ్యారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని మృతదేహాన్ని మత్స్యకారులు బయటికి తీసుకొచ్చారు.

News January 16, 2026

కనుమ పండుగ విశిష్టత మీకు తెలుసా..?

image

సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అంటారు. దీనినే పశువుల పండగ అనికూడా అంటారు. సంవత్సరం కాలం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవాలను ఆరాధించే రోజే ఈ కనుమ పండుగ. పశుపక్షాదులకు గౌరవాన్ని సూచించే పండుగగా కనుమ ప్రసిద్ధి చెందింది. ఈ కనుమ రోజు రైతులు తమ పశువులను ప్రత్యేకంగా అలంకరించి పూజించి వాటికి కృతజ్ఞతలు తెలుపుతారు.