News February 21, 2025
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మడానికి వీల్లేదు: కలెక్టర్

ఇప్పటి వరకు పట్టాలు ఇచ్చిన రెండు పడకల గృహాల్లో అసలైన లబ్ధిదారులు నివాసం లేనివి గుర్తించి నోటీసులు జారీ చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. నిబంధనల ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అద్దెకుగాని, లీజ్కు లేదా అమ్మడానికి వీలు లేదన్నారు.
Similar News
News January 5, 2026
NGKL: నేటి ప్రజావాణి 31 ఫిర్యాదులు

నాగర్కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్ బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి, చట్టపరంగా తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
News January 5, 2026
రాష్ట్రంలో 220 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు JAN 8 నుంచి 22వరకు అప్లై చేసుకోవచ్చు. MD/MS/DNB/DM/MCH అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కేవలం ఏపీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. <
News January 5, 2026
NLG: బ్యాలెట్ వైపే మొగ్గు!

మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అందుకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచనప్రాయంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే 2014లో ఈవీఎంలతో, 2020లో కరోనా కారణంగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ప్రభుత్వం బ్యాలెట్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.


