News March 24, 2025
డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్

కర్నూలులో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోటీల్లో కర్నూలుకు చెందిన రుత్విక్ కళ్యాణ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. నంద్యాలతో జరిగిన మ్యాచ్లో 219 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మరోవైపు ఆదోనితో జరిగిన మ్యాచ్లో 122 బంతుల్లో 154 పరుగులు చేసి తన సత్తా చాటాడు. క్రికెట్లో అంతర్జాతీయ స్థాయికి రుత్విక్ కళ్యాణ్ చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
Similar News
News February 23, 2026
38 ఫిర్యాదులు స్వీకరించిన ఆదిలాబాద్ SP

బాధితుల పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజా ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. వెంటనే స్పందించిన ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 38 ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు.
News February 23, 2026
అభిషేక్కు కొన్ని మ్యాచులు బ్రేక్ ఇవ్వాలి: కైఫ్

T20WCలో విఫలమవుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మకు కొన్ని మ్యాచులు బ్రేక్ ఇవ్వాలని భారత మాజీ క్రికెటర్ కైఫ్ అభిప్రాయపడ్డారు. ‘ఇదేం బైలాటరల్ సిరీస్ కాదు. వరల్డ్ కప్లో ప్రతి మ్యాచ్ కీలకం. ప్రస్తుతం అభిషేక్ ఫామ్ కోల్పోయారు. నాలుగు మ్యాచులు అవకాశాలు ఇచ్చినా ఫెయిలయ్యారు. ఇలాగే కంటిన్యూ చేయకుండా అతనికి బ్రేక్ ఇవ్వాలి. ఆ స్థానంలో సీనియర్ ప్లేయర్ సంజూను ఆడించాలి’ అని సూచించారు.
News February 23, 2026
బంగారం ధరల పెరుగుదలపై నిర్మల ఏమన్నారంటే?

బంగారం ధర లిమిట్ దాటిన మాట నిజమే కానీ ఆందోళనకర స్థాయికి చేరినట్లు తాను అనుకోవట్లేదన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. RBI బోర్డ్ డైరెక్టర్లతో సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. గోల్డ్ సామాన్యుడికి ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు. ఈ ధరలను RBI పర్యవేక్షిస్తోందని దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం, వెండిని కొనడం వల్లే వాటి ధరలు పెరుగుతున్నాయన్నారు.


