News January 19, 2025

డబ్బా కొట్టడం మానేసి పాలనపై దృష్టి పెట్టండి: హరీశ్ రావు

image

సీఎం రేవంత్‌ రెడ్డి అబద్ధాలపై ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు అమలు చేశామని ఢిల్లీకి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారూ.. మీ పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న దుస్థితి నెలకొందని తెలిపారు. ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన మీకు చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు.

Similar News

News October 30, 2025

మెదక్: రైతులకి ఇబ్బందులు లేకుండా చర్యలు: కలెక్టర్

image

ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రైతులకి ఇబ్బందులు కలగకుండా యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం హవేలి ఘనపూర్ మండలం శాలిపేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 10,530 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.

News October 30, 2025

ఏసీబీకి పట్టుబడ్డ మెదక్ ట్రాన్స్కో డీఈ

image

మెదక్ ట్రాన్స్ కో డివిజనల్ ఇంజినీర్ షేక్ షరీఫ్ చాంద్ బాషా ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.21 వేల నగదు తీసుకుంటుండగా ఉమ్మడి మెదక్ జిల్లా డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పట్టుకున్నారు. ఓ పని విషయంలో నగదు తీసుకుంటూ పట్టు బడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏసీబీ అధికారులు రావడంతో మెదక్ ట్రాన్స్కో కార్యాలయంలో సిబ్బంది లేకుండా పోయారు.

News October 30, 2025

మెదక్: రేపు బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్

image

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈ నెల 31న మెదక్‌లోని PNR స్టేడియంలో ‘ఓపెన్ టు ఆల్’, 40+ వయసు విభాగంలో బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌ ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఆసక్తి గల వారు గురువారం సాయంత్రం 5 గంటలలోపు ఆర్ఎస్సై నరేష్ (87126 57954) వద్ద పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.