News January 20, 2025
డయేరియా కేసులపై మంత్రి కొండపల్లి ఆరా

బొండపల్లి మండలం బిల్లలవలస డయేరియా కేసుల నమోదు ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరా తీశారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఆయన.. జిల్లా వైద్యాధికారులను వెంటనే అప్రమత్తం చెయ్యాలని సూచించారు. గ్రామాన్ని సందర్శించి, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. డయేరియా ప్రబలడానికి కారణాలు తెలుసుకొని, గ్రామంలో ఇకపై వ్యాధి విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News February 18, 2025
విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయ MLC ఓటర్లు ఇలా..!

➤ మొత్తం ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్య: 4,937
➤ పురుష ఓటర్లు: 3,100
➤ మహిళా ఓటర్లు:1,837
➤ పోలింగ్ కేంద్రాల సంఖ్య: 29
➤ పోలింగ్ తేదీ: 27.02.2025
➤ ఓట్ల లెక్కింపు తేదీ: 03.03.2025
News February 18, 2025
జిల్లాలో హోటల్స్కు ప్రభుత్వం రేటింగ్: కలెక్టర్

పర్యావరణ హితంగా, పర్యాటకులను ఆకర్షించేలా నడిపే హోటళ్లకు ప్రభుత్వం గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇస్తుందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో హోటల్ యజమానులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చే ఈ రేటింగ్ను హోటల్స్ ఆన్లైన్ లో అప్లోడ్ చేసుకోవచ్చునని, అందువలన ఆయా హోటల్స్కు ర్యాంకింగ్ బుక్ చేసుకునే వారికీ తెలుస్తుందని పేర్కొన్నారు.
News February 17, 2025
VZM: మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ

మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని విజయనగరం ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో రామతీర్థాలకు 45 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా ఎస్.కోట డిపో నుంచి పుణ్యగిరికి 35 బస్సులు, ఎస్.కోట నుంచి సన్యాసిపాలెంకు 10 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.