News June 21, 2024

డయేరియా నియంత్రణకు చర్యలు: డీకే బాలాజీ

image

జిల్లాలో డయారియా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ వైద్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి ఆయన హాజరయ్యారు. వర్షాకాలం నేపథ్యంలో తాగునీరు కలుషితమై డయేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు.

Similar News

News December 23, 2025

దశాబ్దాల భూ సమస్యకు మోక్షం.. కలెక్టర్‌కు సన్మానం

image

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 22-A భూ సమస్యను సానుకూలంగా పరిష్కరించినందుకు కలెక్టర్‌ బాలాజీను మచిలీపట్నానికి చెందిన ఓ న్యాయవాది సన్మానించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ‘మీ-కోసం’ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ చొరవతో వందలాది కుటుంబాలకు మేలు జరిగిందని, ప్రజల సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు అభినందనీయమని న్యాయవాది కొనియాడారు. ఈ పరిష్కారంతో భూ యజమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

News December 22, 2025

అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అట్రాసిటీ కేసుల పరిష్కార చర్యలు, దళితవాడల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించారు.

News December 22, 2025

టైమ్ బాండ్ ప్రకారం PGRS అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్

image

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను టైమ్ బాండ్ ప్రకారం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలపై సమీక్షించిన కలెక్టర్ తక్షణమే క్లియర్ చేయాలన్నారు. ఈ-ఆఫీల్ ఫైల్స్ క్లియరెన్స్ లో కూడా చురుగ్గా వ్యవహరించాలన్నారు.