News June 6, 2024
డాక్టర్ నుంచి అరకు ఎంపీగా

రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీచినా అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా వైసీపీ అభ్యర్థి గుమ్మ తనూజరాణి గెలుపొందారు. హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామానికి చెందిన తనూజరాణి ఎంబీబీఎస్ చేశారు. వైద్య వృత్తిలో డీఎంహెచ్వో, ఐసీడీఎస్ కార్యాలయాల్లో జిల్లా ఎపిడెమియాలజిస్టుగా పనిచేసేవారు. 2022లో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ కుమారుడు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినయ్ను వివాహమాడారు.
Similar News
News February 7, 2025
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో భీమిలి డివిజన్ రెవెన్యూ అధికారులతో కాన్ఫెరెన్స్లో సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులపై రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. అన్యాక్రాంతానికి గురైన భూములను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
News February 6, 2025
‘ఇంటింటికీ వెళ్లి అంగవైకల్యం గల చిన్నారులను గుర్తించాలి’

విశాఖ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ అవగాహన నిర్వహించారు. ఫిబ్రవరి 10 నుంచి 24 వరకు సిబ్బంది ఇంటింటికి వెళ్లి అంగవైకల్యం గల చిన్నారులను గుర్తించాలన్నారు. మానసికంగా, శారీరకంగా వైకల్యం ఉన్న పిల్లలకు వైద్యం అందిస్తే చిన్నతనంలోనే మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంంటుందన్నార. అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.
News February 6, 2025
భీమిలి: ఇన్స్టాలో పవన్ను తిట్టిన వ్యక్తిపై కేసు

తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో Dy CM పవన్ కళ్యాణ్ను తిడుతూ ఇన్స్టాలో పోస్టు పెట్టిన భీమిలి మండలం జీరుపేట గ్రామానికి చెందిన వ్యక్తిపై కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 2న జీరు వీరుబాబు పెట్టిన పోస్టుపై విజయవాడకు చెందిన TDP బూత్ కన్వీనర్ హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమిలి పోలీసుల సాయంతో గవర్నర్పేట పోలీసులు వీరబాబును బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.