News January 9, 2025
డిండి: ఆకతాయిలతో కోర్టు ఆవరణం శుభ్రం చేయించారు
కందుకూరులో ఇటీవల మద్యం సేవించి ఓ వ్యక్తిపై అకారణంగా దాడికి ప్రయత్నించి అలజడి సృష్టించిన కోక అభిషేక్, జోసెఫ్, శివాజీపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు ఎదుట బుధవారం ప్రవేశపెట్టారు. ముగ్గురు ఆకతాయిలు ఒక్కరోజు శిక్షలో భాగంగా కమ్యూనిటీ సర్వీస్ కింద కోర్టు ఆవరణం శుభ్రం చేయాల్సిందిగా స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ పొట్ట చెన్నయ్య ఆదేశించారని ఎస్సై రాజు అన్నారు. వారితో శిక్షను అమలు చేశామన్నారు.
Similar News
News January 26, 2025
నల్గొండ: జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 26 నుంచి 4 నూతన పథకాల అమలు ప్రారంభమవుతుందని రాష్ట్ర ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా పథకాల అమలుకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ పథకాల అమలుకై గ్రామ, వార్డుసభలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
News January 25, 2025
నల్లగొండ: రూ.500 కోట్లతో జిల్లా అభివృద్ధి: కోమటిరెడ్డి
నల్లగొండ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ఏడాది కాలంలో రూ.500 కోట్లు మంజూరు చేయించి తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు చేపట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. 11లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 11 నీటి ట్యాంకులను నిర్మిస్తున్నామని.. వచ్చే ఏప్రిల్ నుంచి ప్రతిఇంటికి ప్రతిరోజు కృష్ణా తాగునీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
News January 25, 2025
తిప్పర్తి: కొండ్ర సైదులు విగ్రహావిష్కరణలో మంత్రి కోమటిరెడ్డి
తిప్పర్తి మండల పరిధిలోని తానేదారుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొండ్ర సైదులు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక నేతలు, గ్రామస్థులను ఆప్యాయంగా పలకరించారు.