News February 4, 2025
డిండి: కోడలు దాడిలో మామ మృతి

కోడలు దాడిలో మామ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని గోనబోయినపల్లిలో జరిగింది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు.. ఇంటి ముందు కూర్చున్న బద్దె రాములు (65)ను కుటుంబ గొడవల కారణంగా పెద్ద కోడలు పెద్దులమ్మ కర్రతో కొట్టి రోడ్డుపై నెట్టి వేయిగా రాములు తల వెనుక భాగంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య జంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News February 6, 2025
చిట్యాల వద్ద రోడ్డుప్రమాదం.. యువకుడి మృతి

చిట్యాల మండలం వెలిమినేడు శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. కర్ణాటక రాయచూర్ నుంచి విజయవాడకు హినప్ప రాజు (22) తన స్నేహితులతో వెళ్తున్నాడు. బైక్ అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో హినప్ప రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 6, 2025
NLG: దేవుడా.. అప్పుడే మండుతున్న ఎండలు

చలికాలం పూర్తికాక ముందే ఎండలు మొదలయ్యాయి. ఫిబ్రవరి తొలివారంలోనే పగటి పూట 40 డిగ్రీలకు దగ్గరగా ఉష్ణోగ్రతలునమోదవుతున్నాయి. బుధువారం నల్గొండ (D) అనుముల మం. ఇబ్రహీంపేటలో 37.4, యాదాద్రి (D)బొమ్మలరామారంలో 37.3, సూర్యాపేట (D) నూతన్కల్లో 37.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయంపూట దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ఈ విచిత్ర వాతావరణంలో ప్రజలులు అవస్థలు పడుతున్నారు.
News February 6, 2025
చెర్వుగట్టులో రేపు అగ్ని గుండాలు

చెర్వుగట్టు శ్రీ పార్వతీసమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వీరముష్టి వంశీయులు మొదట పూజలు నిర్వహించి అగ్ని గుండాల కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇక్కడ ఆనవాయితీ. పంటను స్వామికి సమర్పించి అగ్ని గుండాలపై నడిస్తే పంటలు బాగా పండి సుభిక్షంగా ఉంటామని భక్తుల నమ్మకం.