News September 5, 2024

డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా వేంపల్లె షరీఫ్‌ కథ

image

వేంపల్లెకు చెందిన కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత వేంపల్లె షరీఫ్‌ రాసిన ‘ఆకుపచ్చ ముగ్గు’ కథను ఏపీ ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం కళాశాల విద్యా కమిషనర్‌ పోలా భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై B.A, B.Com, B.Sc, B.B.A చదువుతున్న విద్యార్థులు 3వ సెమిస్టర్‌ కింద చదువుకోవాల్సిన పాఠ్యాంశాల్లో వేంపల్లె షరీఫ్‌ కథ కూడా ఉంటుంది.

Similar News

News October 19, 2025

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

image

దీపావళిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికి YS జగన్ ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా దీపాలు వెలగాలని, ఆనందాలు వెల్లువలా పొంగాలని అన్నారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కోరుతున్నట్లు జగన్ పేర్కొన్నారు.

News October 19, 2025

కడప: రేపు పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు

image

దీపావళి పండుగ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ తెలిపారు. అర్జీదారులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

News October 19, 2025

పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: అదనపు ఎస్పీ

image

పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామని జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) కె. ప్రకాశ్ బాబు తెలిపారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నేపథ్యంలో ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల కుటుంబాలతో సమావేశమై, వారి సమస్యలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి, ప్రభుత్వం అందించే సౌకర్యాలపై అవగాహన కల్పించామని చెప్పారు.