News April 27, 2024
డిచ్పల్లిలో చిన్నారిపై వీధి కుక్క దాడి

డిచ్పల్లి మండలం ఘన్పూర్లో శనివారం ఉదయం ఓ చిన్నారి రోడ్డుపై ఆడుకుంటుండగా వీధికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో కిందపడిన చిన్నారి అరవడంతో గమనించిన తల్లి కుక్కను తరిమేసింది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. గ్రామంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని, పంచాయతీ సిబ్బంది స్పందించి వాటిని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News December 16, 2025
NZB: మూడో విడత.. పోలింగ్ జరిగే మండలాలివే

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్కు 1100 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మూడో విడత పోలింగ్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లోని కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జరగనుంది.
News December 16, 2025
3వ విడత.. 1100 మంది సిబ్బందితో బందోబస్తు

3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ఠమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు CP సాయి చైతన్య వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 1100 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.
News December 16, 2025
NZB: తుది దశలో మహిళా ఓటర్లే కీలకం

NZB జిల్లాలో తుది దశలో జరిగే కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జయాపజయాలు ప్రభావితం చేసేది మహిళా ఓటర్లే. మొత్తం 3,14,091 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 1,44,587 మంది, మహిళలు 1,69,498 మంది, ఇతరులు ఆరుగురు ఉన్నారు. ఈ లెక్కన పురుషుల కన్నా మహిళా ఓటర్లు 24,911 మంది ఎక్కువగా ఉన్నారు.


