News June 29, 2024

డిప్యూటీ సీఎంగా పిఠాపురానికి తొలిసారి పవన్‌

image

డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌ కళ్యాణ్‌ జులై 1న తొలిసారి పిఠాపురం రానున్నారు. తనను గెలిపించిన ప్రజలకు అభినందనలు తెలపనున్నారు. ఉప్పాడ సెంటర్‌లో జరిగే వారాహి సభలో పవన్‌ ప్రసంగిస్తారు. 3రోజుల పాటు ఆయన పిఠాపురంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అటు వారాహి సభకు ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల నుంచి జనసేన నేతలు, అభిమానులు భారీగా తరలి రానున్నట్లు సమాచారం. ఏర్పాట్లపై కాకినాడ కలెక్టర్ షన్మోహన్‌ శుక్రవారం సమీక్షించారు.

Similar News

News November 12, 2025

తూ.గో: ఎక్కడ ఎన్ని ఇళ్లంటే..!

image

తూ.గో జిల్లాలో 8,773 ఇళ్లలో గృహప్రవేశాలు బుధవారం జరగనున్నాయి. పీఎంఏవై బీఎల్సీ పథకం కింద 7,200, పీఎంఏవై గ్రామీణ పథకం కింద 1,573 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశామని హౌసింగ్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాతి బుజ్జి తెలిపారు. రాజమండ్రిలో 375 ఇళ్లు, రాజానగరంలో 631, గోపాలపురంలో 1,760 ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు.

News November 12, 2025

తూ.గో: ఎక్కడ ఎన్ని ఇళ్లంటే..!

image

తూ.గో జిల్లాలో 8,773 ఇళ్లలో గృహప్రవేశాలు బుధవారం జరగనున్నాయి. పీఎంఏవై బీఎల్సీ పథకం కింద 7,200, పీఎంఏవై గ్రామీణ పథకం కింద 1,573 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశామని హౌసింగ్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాతి బుజ్జి తెలిపారు. రాజమండ్రిలో 375 ఇళ్లు, రాజానగరంలో 631, గోపాలపురంలో 1,760 ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు.

News November 11, 2025

తూ.గో: హోం స్టే పెడితే రూ.5లక్షలు

image

తూ.గో జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో కనీసం ఓ గది నుంచి గరిష్ఠంగా 6గదులతో హోం స్టే ఏర్పాటు చేసుకోవచ్చని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ‘కొత్తగా పెట్టేవారికి స్వదేశ దర్శన్ పథకం కింద రూ.5 లక్షల ప్రోత్సాహకం ఇస్తాం. పాత హోమ్ స్టే పునరుద్ధరణకు రూ.3లక్షల వరకు సాయం చేస్తాం. 7ఏళ్లు 100 శాతం SGST తిరిగి చెల్లిస్తాం. మొదటి మూడేళ్లు రిజిస్ట్రేషన్ ఉచితం. యజమాని అదే ఏరియాలో ఉండాలి’ అని కలెక్టర్ చెప్పారు.