News January 23, 2025

డిప్యూటీ సీఎంతో బీటెక్ రవి భేటీ

image

పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యురేనియం ప్రాజెక్ట్ నుంచి వెలువడుతున్న వ్యర్థాల నుంచి ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అలాగే భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం, పునరావాసం, ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలపై చర్చించి వినతి పత్రం అందజేశారు. యురేనియం బాధితులకు అండగా ఉంటానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.

Similar News

News November 18, 2025

‘రాయలసీమ’ పేరుకు నేటికి 97 ఏళ్లు!

image

బ్రిటిష్ కాలంలో ‘దత్త మండలం’గా పిలవబడిన మన ప్రాంతానికి ‘రాయలసీమ’ అనే పేరు పెట్టి నేటికి 97ఏళ్లు పూర్తయ్యాయి. 1928 నవంబర్ 18న నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరి నారాయణరావు ఈ పేరును ప్రతిపాదించారు. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలుకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ ‘‘రాయలసీమ’’ అనే పేరును ప్రతిపాదించారు. పప్పూరు రామాచార్యులు ఈ ప్రతిపాదనను బలపరచగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

News November 18, 2025

‘రాయలసీమ’ పేరుకు నేటికి 97 ఏళ్లు!

image

బ్రిటిష్ కాలంలో ‘దత్త మండలం’గా పిలవబడిన మన ప్రాంతానికి ‘రాయలసీమ’ అనే పేరు పెట్టి నేటికి 97ఏళ్లు పూర్తయ్యాయి. 1928 నవంబర్ 18న నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరి నారాయణరావు ఈ పేరును ప్రతిపాదించారు. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలుకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ ‘‘రాయలసీమ’’ అనే పేరును ప్రతిపాదించారు. పప్పూరు రామాచార్యులు ఈ ప్రతిపాదనను బలపరచగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

News November 18, 2025

గండికోటలో ప్రమాదాల అంచున సెల్ఫీ

image

గండికోట ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. యువకులు, విద్యార్థులు, పెద్దలు, కొందరు పర్యాటకులు గండికోటను దర్శిస్తుంటారు. ఇక్కడ లోయ ఉండడంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంటుంది. రెండు కొండల మధ్య లోయ చుపరులను ఆకట్టుకుంటూ కనువిందు చేస్తుంటుంది. ఈ దృశ్యాన్ని తిలకిస్తూ ప్రమాదపు అంచున ఫొటోలు దిగుతూ ఉంటారు. అధికారులు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.