News March 20, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో బేబినాయన భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన గురువారం భేటీ అయ్యారు. అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను విన్నవించారు. బాడంగి మండలం గొల్లాదిలో వేగవతి నదిపై వంతెన ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పామని వంతెన నిర్మాణానికి సహకరించాలని కోరారు. వంతెన నిర్మాణం పూర్తయితే నిర్మాణం వలన బాడంగి, రాజాం, దత్తిరాజేరు, మెరకముడిదాం గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.
Similar News
News March 6, 2026
చీపురుపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో డెడ్ బాడీ కలకలం

చీపురుపల్లి రైల్వేస్టేషన్ శివారున రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు శ్రీకాకుళం రైల్వే జీఆర్పీ మధు సూదనరావు శుక్రవారం తెలిపారు. డెడ్ బాడీ నుంచి దుర్వాసన వస్తోందని, కుళ్లే స్థితికి చేరుకుండడంతో మూడు రోజుల క్రితం ప్రమాదం జరగవచ్చన్నారు. మృతుడు గల్ల చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడని, చేతిపై ఓ పచ్చబొట్టు ఉందన్నారు. గుర్తించిన వారు జీఆర్పీ స్టేషన్ను సంప్రదించాలన్నారు.
News March 6, 2026
VZM: ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీ ఆవిష్కరణ

ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరీను విడుదల చేసి అధికారులకు అందజేశారు. ప్రభుత్వ పరిపాలనలో రోజువారీ కార్యక్రమాలు, పరిపాలన సంబంధిత అంశాలను నమోదు చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, డీఆర్ఓ మురళీ, తదితరులున్నారు.
News March 5, 2026
VZM: మిషన్ హార్టీ విజన్తో ఉద్యాన సాగు విస్తరణ

జిల్లాలో మిషన్ హార్టీ విజన్ అమలు ద్వారా ఉద్యాన పంటల సాగును విస్తరించి రైతులకు నిరంతర ఆదాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయాన్ని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్లో అదనంగా 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.


