News June 29, 2024
డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి దోర్నాల నీటి సమస్య
ప్రకాశం జిల్లా దోర్నాలలో నెలకొన్న నీటి సమస్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. నిన్న <<13526596>>మంచి నీటి కోసం మహిళలు రోడ్డెక్కిన<<>> విషయం తెలిసిందే. విషయాన్ని యర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి గౌతమ్ రాజ్ ద్వారా తెలుసుకుని సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి ట్యాంకర్లతోనైనా నీటి ఎద్దడిని తీర్చేందుకు RWS అధికారులు సన్నద్ధం అయ్యారు.
Similar News
News October 8, 2024
ప్రకాశం: కేజీబీవీల్లో 52 నాన్ టీచింగ్ పోస్టులు
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ 52 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు డీఈఓ డి.సుభద్ర తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోగా ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18న తుది జాబితా తయారు చేస్తామని, 21న జిల్లా కమిటీ ఆమోదం తర్వాత 22న ఆప్కాస్ ఛైర్మన్కు జాబితాను సమర్పిస్తామని అన్నారు.
News October 7, 2024
మార్టూరులో విమానాశ్రయానికి ప్రతిపాదన: MLA ఏలూరి
మార్టూరులో విమానాశ్రయం, చినగంజాం మోటుపల్లిలో నౌకాశ్రయానికి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టినట్లు పర్చూరు MLA ఏలూరు సాంబశివరావు తెలిపారు. విజన్ 2047రాష్ట్రా అభివృద్ధిలో భాగంగా.. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరగబోయే సమావేశంలో ఈ ప్రతిపాదనలు ఉంచనున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా భవిష్యత్తులో పలు మౌలిక వసతుల కల్పనకు ఈ డాక్యుమెంటరీ ప్రతిపాదన చేసినట్లు తెలిపారు.
News October 7, 2024
చిన్నగంజాంలో బాలుడు దుర్మరణం
ఆటో గేర్ తగిలి ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందిన ఘటన చిన్నగంజాంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జీవన్(7) ఆగిఉన్న ఆటోను ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు హ్యాండిల్ గేర్లను తగలడంతో ఆటో ఒక్కసారిగా ముందుకు కదిలింది. వెంటనే బయపడిన బాలుడు ఆటోలో నుంచి కిందకు దూకే క్రమంలో పక్కనే ఉన్న గోడకు తల బలంగా తగలడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.